యాప్నగరం

పబ్లిగ్గా ఐపీఎస్ ఆఫీసర్స్ ఘర్షణ

ప్రధాని నరేంద్ర మోడీ లక్నో పర్యటన కోసం జరుగుతున్న భద్రతా ఏర్పాట్లని సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన...

TNN 20 Jun 2017, 7:56 pm
ప్రధాని నరేంద్ర మోడీ లక్నో పర్యటన కోసం జరుగుతున్న భద్రతా ఏర్పాట్లని సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో తోటీ ఐపీఎస్ ఆఫీసర్స్ సమక్షంలోనే ఇద్దరు ఐపీఎస్ అధికారులు వాగ్వీవాదానికి దిగారు. స్టేజీపై కూర్చున్న లక్నో ఎస్ఎస్‌పీ దీపక్ కుమార్‌కి, ఈ సమీక్షా సమావేశానికి హాజరైన మరో ఐపీఎస్ ఆఫీసర్ నదీమ్ సింగ్‌కి మధ్య ఈ వాగ్వీవాదం చోటుచేసుకుంది.
Samayam Telugu spat between ips officers in lucknow caught on camera
పబ్లిగ్గా ఐపీఎస్ ఆఫీసర్స్ ఘర్షణ


గంటల తరబడి నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో కనీసం తాగు నీటి వసతి కూడా ఏర్పాటు చేయలేదని నదీమ్ సింగ్ లేవనెత్తగా... అందుకోసమే నువ్వు(నదీమ్ సింగ్) ఇక్కడికొచ్చినట్టయితే, ఇక్కడ నీకు పని లేదు ఇక నువ్వు వెళ్లొచ్చు అని దీపక్ కుమార్ సూచించారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇదిలావుంటే, ప్రధాని లక్నో పర్యటన నేపథ్యంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ సమీక్షా సమావేశంలో ఏర్పాట్లని సమీక్షించాల్సిందిపోయి ఐపీఎస్ ఆఫీసర్లే ఇలా గొడవకి దిగితే ఎలా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.