యాప్నగరం

వాజ్‌పేయి కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు..

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని దేశమంతా కోరుకుంటుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

Samayam Telugu 16 Aug 2018, 2:56 pm
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని దేశమంతా కోరుకుంటుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ.. ముంబయిలోని బోరీవాలీలోని బీజేపీ ఆఫీసులో పార్టీ నాయకులు ప్రత్యేక యాగం నిర్వహించారు.
Samayam Telugu prayer


మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ నేత షకిర్ ఖాన్ గ్వాలియర్‌లోని దర్గాలో చాదర్ సమర్పించి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అటల్ బిహారి వాజ్‌పేయి కోలుకోవాలనిర ప్రార్థించారు.
లక్నోలోని ఎన్డీ కాన్వెంట్ పబ్లిక్ స్కూలులో వాజ్‌పేయి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
యూపీలోని ఫరీదాబాద్‌లో ఉన్న బారాబంకీ మదరసా విద్యార్థులు కూడా వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని అల్లాను వేడుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గ్వాలియర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల విద్యార్థులు.. వాజ్‌పేయి కోలుకోవాలని యాగం నిర్వహించారు.
ఖాదిమ్ సయ్యద్ ఇర్ఫాన్ చిస్తీ నేతృత్వంలోని ముస్లిం వర్గానికి బృందం.. వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని.. అజ్మీర్ దర్గాలో చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.