యాప్నగరం

భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 11 మంది మృతి

దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులను ట్రక్కు రూపంలో మృత్యువు కబళించింది. ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో ఈ విషాదం జరిగింది. ప్రసిద్ధ పూర్ణగిరి ఆలయ సందర్శనకు వెళ్తున్న భక్తులపైకి అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు 11 మంది పర్యాటకులను బలి తీసుకుంది.

Samayam Telugu 18 May 2018, 7:42 pm
దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులను ట్రక్కు రూపంలో మృత్యువు కబళించింది. ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ పూర్ణగిరి ఆలయ సందర్శనకు వెళ్తున్న భక్తులపైకి అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు 11 మంది పర్యాటకులను బలి తీసుకుంది. కంకర లాంటివి తరలించే ఆ భారీ ట్రక్కు కింద నలిగి 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో మరో 19 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు.
Samayam Telugu mishap


మృతదేహాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. రహదారి అంతా రక్త ధారలతో భయానకంగా మారింది. చంపావత్‌ జిల్లాలోని తనక్‌పూర్‌ వద్ద శుక్రవారం (మే 18) ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా యువకులు, మధ్య వయసువారే. ఉత్తరప్రదేశ్‌లోని బరేలి ప్రాంతానికి చెందిన వీరంతా తమ కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి పూర్ణగిరి ఆలయ దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో అనూహ్యంగా మృత్యువాతపడటంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

కొంపముంచిన కాలినడక..
ప్రమాదం జరిగిన సమయంలో భక్తులు పూర్ణగిరి ఆలయానికి 30 కి.మీ. దూరంలో ఉన్నారు. అమ్మవారిపై గౌరవ భావంతో, మొక్కులో భాగంగా వారంతా కాలినడకన పూర్ణగిరి క్షేత్రానికి వెళ్తున్నారు. ఇదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది.

మరణించిన వారిలో ఐదుగురు యువకులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మృతులను కమల్ (19), వీర్‌ సింగ్‌ (18), విశాల్‌ (17), కేశర్‌ సింగ్‌ (16), రామ్ కుమార్‌ (16), దీన్‌దయాల్‌ (35), బాబు (12), సోను (8), సోహన్‌ లాల్‌ (40), రామ్‌స్వరూప్‌ (40)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.