యాప్నగరం

‘సన్యాసికి అవార్డులతో పనేంటి.. పద్మశ్రీ వద్దు’

కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ పురస్కారాల కోసం చాలా మంది ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. అంతేకాదు ఈ అవార్డులను దక్కించుకోడానికి పైరవీలకు కూడా పాల్పడతారు.

TNN 28 Jan 2018, 5:06 pm
కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ పురస్కారాల కోసం చాలా మంది ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. అంతేకాదు ఈ అవార్డులను దక్కించుకోడానికి పైరవీలకు కూడా పాల్పడతారు. అలాంటింది ఓ వ్యక్తి మాత్రం కేంద్రం తనకు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించి, ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇదేదో ఆయన కేంద్ర ప్రభుత్వంపై కోపంతో చేసిన పనికాదు. 2018 పద్మ అవార్డుల్లో కర్ణాటకకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సిద్ధేశ్వర్ స్వామి పేరును కేంద్రం ప్రకటించింది. ఆధ్యాత్మిక విభాగంలో జ్ఞాన యోగాశ్రమ స్వామీజీకి ఈ అవార్డును ప్రకటించారు. అయితే అవార్డును ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఏ పురస్కారాలు, గౌరవాలు తనకు అక్కర్లేదని ప్రకటించారు. ‘నేనొక సన్యాసి. నాకు ఏ అవార్డు కానీ, గౌరవం కానీ అవసరం లేదు. చాలా మంది వ్యక్తులున్నారు. ఈ అవార్డులతో వారిని గౌరవించండి’ అని సూచించారు.
Samayam Telugu spiritual leader siddheshwar swamiji refuses to accept padma shri award
‘సన్యాసికి అవార్డులతో పనేంటి.. పద్మశ్రీ వద్దు’


Spiritual leader Siddheshwar Swamiji of Vijaypur has written a letter to Prime Minister Narendra Modi declining to accept the Padma Shri award which was conferred upon him. pic.twitter.com/UfQHUTgRFn — ANI (@ANI) January 28, 2018
ఈ మేరకు సిద్ధేశ్వర్ స్వామి ప్రధానమంత్రికి ఓ లేఖను రాశారు. ‘ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని నాకు ఇవ్వాలని నిర్ణయించినందుకు భారత ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు. మీ పట్ల, భారత ప్రభుత్వం పట్ల గౌరవంతో ఈ అవార్డును స్వీకరించలేనని తెలియజేస్తున్నాను. మీరు నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’ అంటూ సిద్ధేశ్వర్ తన లేఖలో పేర్కొన్నారు. తాను గతంలోనూ ఏ అవార్డునూ స్వీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. ధార్వాడ్ యూనివర్సిటీ తనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయడానికి ముందుకొచ్చినా, గౌరవపూర్వకంగా దాన్ని తిరిగి ఇచ్చేశానని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.