యాప్నగరం

రండి బాబూ రండి..కర్ణాటక ఎమ్మెల్యేలకు కేరళ టూరిజంశాఖ ఆహ్వానం

కర్ణాటక ఎమ్మెల్యేలను రండి బాబూ రండి అంటోంది కేరళ పర్యాటకశాఖ. తమ రాష్ట్రానికి వచ్చేయండి... ప్రకృతి అందాలను తనివితీరా చూడండంటోంది. అదేంటి కేరళ పర్యాటకశాఖ వాళ్లకు ఆహ్వానం ఎందుకు ఆహ్వానం పలికిందని షాకవుతున్నారా.

Samayam Telugu 15 May 2018, 8:24 pm
కర్ణాటక ఎమ్మెల్యేలను రండి బాబూ రండి అంటోంది కేరళ పర్యాటకశాఖ. తమ రాష్ట్రానికి వచ్చేయండి... ప్రకృతి అందాలను తనివితీరా చూడండంటోంది. అదేంటి కేరళ పర్యాటకశాఖ వాళ్లకు ఆహ్వానం ఎందుకు ఆహ్వానం పలికిందని షాకవుతున్నారా. అక్కడే ఉంది చిన్న కిటుకు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇన్నాళ్లూ ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్‌ బిజీతో పాటూ... మానసికంగా కూడా ఒత్తిడితో ఉంటారు. వారందరికి ఇదే మా ఆహ్వానం... అందరూ రండి... అందమైన, సురక్షితమైన మా రిసార్ట్స్‌లో సేద తీరమని ట్వీట్ చేసింది.
Samayam Telugu Kerala Resorts


ఈ ట్వీట్‌కు నెటిజన్లు అదిరిపోయే రిప్లై ఇస్తున్నారు. అబ్బా ఏం ఐడియా... టూరిజంశాఖ ఇలా కూడా మార్కెటింగ్ చేస్తుందా అని కొందరు కామెంట్స్ చేశారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమేనా మాకు ఆహ్వానం లేదా అంటూ సెటైర్ పేల్చారు. ఒకరైతే ఎందుకు ఆ రిసార్ట్స్‌కు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనుకుంటున్నారా అంటూ కౌంటరిచ్చారు. మొత్తం మీద కేరళ పర్యాటకశాఖ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అవుతోంది.

Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.