యాప్నగరం

మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు విచ్చేసే విదేశీ అతిథులు వీరే..

మే 30 సాయంత్రం ఏడు గంటలకు మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు బిమ్‌స్టెక్ దేశాల అధినేతలతోపాటు మారిషస్, కిర్గిజ్ నేతలకు ఆహ్వానం పంపారు.

Samayam Telugu 28 May 2019, 10:26 pm
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. గురువారం జరగనున్న ప్రమాణ స్వీకార వేడుకకు అంతర్జాతీయంగా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. బిమ్‌స్టెక్ దేశాలకు చెందిన అధినేతలను మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మే 30న జరగనున్న మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేఅతిథుల జాబితాను అధికారికంగా ప్రకటించారు.
Samayam Telugu modi oath


బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విదేశీ పర్యటనకు వెళ్తున్నందున ఆమె బదులు ఆ దేశ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్ హమీద్ మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్, మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మియింట్, మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని కేపీ ఓలీ, భూటాన్ ప్రధాని లోటే త్సేరింగ్, థాయిలాండ్ ప్రత్యేక రాయబారి గ్రిసాడా బూన్రాచ్ హాజరు కానున్నారు.

ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు బయల్దేరి వెళ్లనున్నారు. జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ముగ్గురూ ఒకే విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.