యాప్నగరం

సెల్వం Vs శశి: సచివాలయంలో స్టాలిన్

అధికార పీఠం కోసం అన్నాడీఎంకేలో చిచ్చు రగిలి గందరోళ పరిస్థితులు నెలకొని ఉండగా..ప్రతిపక్ష

Samayam Telugu 13 Feb 2017, 12:16 pm
అధికార పీఠం కోసం అన్నాడీఎంకేలో చిచ్చు రగిలి గందరోళ పరిస్థితులు నెలకొని ఉండగా..ప్రతిపక్ష డీఎంకే అవకాశం కోసం వేచిచూస్తోంది. అన్నాడీఎంకే చీలితే తమకే లాభిస్తుందన్న రీతిలో డీఎంకే నేత స్టాలిన్ పార్టీ వర్గాలకు చెప్పినట్లు సమాచారం.
Samayam Telugu stalin visits secretariat in chennai
సెల్వం Vs శశి: సచివాలయంలో స్టాలిన్


ఇది ఉండగా సోమవారం మద్యాహ్నం 12గంటలకు సచివాలయానికి స్టాలిన్ చేరుకున్నారు. మరికాసేపట్లో అపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం సైతం సెక్రెటరియట్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో అసలేం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే తనను సీఎం చేయాలంటే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మెజార్టీ ఎమ్మెల్యేలకు మహాబలిపురంలోని ఓ రిసార్టులో శిబిరం ఏర్పాటు చేశారు. మరోవైపు ఎమ్మెల్యేలను స్వేచ్ఛగా తిరగనీయాలని ఓపీఎస్ డిమాండ్ చేస్తున్నారు.

అటు శశికళ, ఇటు ఓపీఎస్ అధికారం కోసం ఎత్తుకుపై ఎత్తులు వేస్తుండగా..వీరిమధ్యలో స్టాలిన్ ఎంట్రీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఓపీఎస్ తో స్టాలిన్ చర్చించడానికే సచివాలయన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.