పాత నోట్ల రద్దు అనేక మంది అమాయక ప్రజల ప్రాణాల మీదకి తెచ్చింది. క్యూలో నిలబడి గుండెపోటుతో మరణించిన వారు, అత్యవసరానికి డబ్బు అందక ఆత్మహత్య చేసుకున్నవారు, ఒత్తిడి తట్టుకోలేక మరణించిన బ్యాంకు ఉద్యోగుల గురించి విన్నాం. ఇప్పుడు బ్యాంకు ముందు తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించాడు. ఉత్తరప్రదేశ్ లోని దేవరియా ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ముందు ప్రజలు భారీగా క్యూలో నిల్చున్నారు. పాత నోట్లను డిపాజిట్ చేసుకోవడం, నగదు మార్పిడి చేసుకోవడం కోసం వారు వేచి యున్నారు. కాగా సాయంత్రం అవుతున్నప్పటికీ క్యూ తరగలేదు. దీంతో బ్యాంకు మూసేసే సమయానికి క్యూలైనులో తొక్కిసలాట సంభవించింది. ఓ వ్యక్తి కిందపడిపోవడంతో అతడిని అందరూ తొక్కేశారు. ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కొంతమంది గాయపడినట్టు కూడా తెలుస్తోంది.
బ్యాంకు ముందు తొక్కిసలాట: ఒకరి మృతి
పాత నోట్ల రద్దు అనేక మంది అమాయక ప్రజల ప్రాణాల మీదకి తెచ్చింది.
TNN 21 Nov 2016, 8:19 pm