యాప్నగరం

నా పర్యటనలను అడ్డుకుంటే జైలుకే: తమిళనాడు గవర్నర్!

తమిళనాడు గవర్నర్, ప్రతిపక్ష పార్టీ డీఎంకే మధ్య తలెత్తిన వివాదం కొత్త మలుపు తిరిగింది. తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ శుక్రవారం నామక్కల్‌ జిల్లాలో పర్యటించినప్పుడు డీఎంకే కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలపడం, వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.

Samayam Telugu 25 Jun 2018, 10:09 am
తమిళనాడు గవర్నర్, ప్రతిపక్ష పార్టీ డీఎంకే మధ్య తలెత్తిన వివాదం కొత్త మలుపు తిరిగింది. తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ శుక్రవారం నామక్కల్‌ జిల్లాలో పర్యటించినప్పుడు డీఎంకే కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలపడం, వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. దీనికి నిరసనగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు శనివారం నాడు రాజ్‌భవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో గవర్నర్‌ జోక్యం చేసుకుంటున్నారంటూ స్టాలిన్‌ ఆరోపించారు. దీనిపై స్పందించిన రాజ్‌భవన్.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులు తెలుసుకునే అధికారం గవర్నర్‌కు ఉందని ఆదివారం నాడు వివరణ ఇచ్చింది. ప్రభుత్వ అధికారులతో సమాలోచనలు జరపడానికి, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి గవర్నర్‌కు పూర్తి అధికారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ శాఖనూ గవర్నర్‌ విమర్శించలేదని పేర్కొంది.
Samayam Telugu తమిళనాడు గవర్నర్ వార్నింగ్


అంతేకాదు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా గవర్నర్‌ అధికారాలను అడ్డుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తప్పవని రాజ్‌భవన్ హెచ్చరించింది. ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం గవర్నర్ కార్యకలాపాలను అడ్డుకునేవారిపై కేసు నమోదుచేసి, ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది. భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమ పథకాల పరిశీలన నిమిత్తం గవర్నర్ పర్యటనలు కొనసాగుతాయని తెలిపింది. రాజ్‌భవన్ ప్రకటనపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్ ప్రత్యక్ష రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజ్‌భవన్ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించాడు. సంక్షేమ పథకాల తీరుతెన్నుల పరిశీలన కోసం గవర్నర్ పర్యటనలను తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది ప్రభుత్వానికి సమాంతర పాలనలో ఓ భాగమని స్టాలిన్ దుయ్యబట్టారు. రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటం కోసం దీనికి మేము నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు గవర్నర్‌ నివాసం ముట్టడికి యత్నించిన వ్యవహారంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సహా 1,111 మందిపై పోలీసులు 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నామక్కల్‌ జిల్లాలో గవర్నర్‌ పర్యటనను అడ్డుకోడానికి ప్రయత్నించిన డీఎంకే కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా వారిని విడుదల చేయాలని డిమాండు చేస్తూ స్టాలిన్‌ అధ్యక్షతన సైదాపేటలో శనివారం ఆందోళన జరిగింది. తర్వాత గవర్నర్‌ నివాసాన్ని ముట్టడించడానికి ర్యాలీగా బయలుదేరిన స్టాలిన్‌, ఆ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.