అరుణాచల్ ప్రదేశ్లోని మారుమూల ప్రాంతమైన తవాంగ్కు రైల్వే సదుపాయం కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఈ రైల్వే లైన్ నిర్మాణం కార్యరూపం దాలిస్తే సాధారణ ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉండనుంది. ఇది పైకి కనిపించే కారణం మాత్రమే కాగా రక్షణ పరంగా మరో కారణం కూడా ఉంది. చైనా సరిహద్దుల్లోని తవాంగ్ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకమైంది. 1962 యుద్ధంలో చైనా ఈ ప్రాంతంలో భారత సైనికులపై దాడి చేసింది. ఆ యుద్ధంలో భారత సైన్యం శక్తికి మించి పోరాడినప్పటికీ, సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల చైనా పైచేయి సాధించగలిగింది. ఈ తప్పిదం నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు చైనా సరిహద్దుల్లో రవాణా సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది.
అందులో భాగంగానే తవాంగ్ వరకూ రైల్వే లైన్ నిర్మించాలని యోచిస్తోంది. ఈ ప్రాంతానికి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. సైనిక బలగాలు, ఆయుధాలను వేగంగా చేరవేసేందుకు వీలవుతుంది. తద్వారా చైనా దూకుడుకు కళ్లెం వేయొచ్చు.
కేంద్రం వైఖరి చూస్తుంటే త్వరలోనే తవాంగ్కు రైల్వే లైన్ రావడం ఖాయం అనిపిస్తోంది. ఈ ప్రాంతానికి రైల్వే లైన్ ఏర్పాటు చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజులను ఆదేశించింది. వారిద్దరూ శని, ఆదివారాల్లో ఈ ప్రాంతంలో పర్యటించి రైల్వే లైన్ గురించి ఇక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు. అంటే దాదాపుగా అనుకూల నిర్ణయం వచ్చే అవకాశాలే ఎక్కువ.
తవాంగ్ నుంచి సుమారుగా 300 కి.మీ. దూరం వెళ్తే భలుక్పాంగ్ రైల్వే స్టేషన్ ఉంది. ఇదే చివరి రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి తవాంగ్ వరకూ రైల్వేలైన్ నిర్మాణం చేపట్టనున్నారు. వైద్యం, ఇతర ప్రధాన అవసరాలకు తవాంగ్ ప్రజలు అసోం రాజధాని గువహటికి రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు మార్గం ద్వారా గువహటి వెళ్లాలంటే 18 గంటల సమయం పడుతుంది. ఇదొక్క రైల్వే లైనే కాదు అరుణాచల్ ప్రదేశ్లో పాసిఘట్ ఎయిర్పోర్ట్, రూపా మధ్య మరో బ్రాడ్గేజ్ రైల్వే లేన్ ఏర్పాటు కోసం కూడా సర్వే నిర్వహించనున్నారు. ఇది ఉత్తర లఖింపూర్- బేమ్- సిలాపతర్ లైన్లో భాగం.
భారత్, చైనా మధ్యలో ఉన్న తవాంగ్ ప్రాంతం తమదేనని, అది టిబెట్లో భాగమని చైనా వాదిస్తోంది. ఈ ప్రాంతంలో భారత నాయకులు, అధికారుల పర్యటనను నిరసిస్తోంది. దలైలామా పర్యటించనుండటం పట్ల కూడా చైనా నిరసన వ్యక్తం చేస్తోంది, బెదిరింపులకు సైతం దిగుతోంది. చైనా నిరసనలను ఏ మాత్రం ఖాతరు చేయని భారత ప్రభుత్వం.. అప్పటి అమెరికా రాయబారి రిచర్డ్ వర్మను ఈ ప్రాంతంలో పర్యటించడానికి అనుమతించింది. టిబెటన్ ఆధ్యాత్మికవేత్త కర్మపా ఓగిన్ ట్రిన్లీ డోర్జీ కూడా గతేడాది అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. మొత్తానికి ఎన్డీయే సర్కారు చైనాకు భలే చెక్ పెడుతోంది కదూ. శభాష్ మోదీజీ.
అందులో భాగంగానే తవాంగ్ వరకూ రైల్వే లైన్ నిర్మించాలని యోచిస్తోంది. ఈ ప్రాంతానికి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. సైనిక బలగాలు, ఆయుధాలను వేగంగా చేరవేసేందుకు వీలవుతుంది. తద్వారా చైనా దూకుడుకు కళ్లెం వేయొచ్చు.
కేంద్రం వైఖరి చూస్తుంటే త్వరలోనే తవాంగ్కు రైల్వే లైన్ రావడం ఖాయం అనిపిస్తోంది. ఈ ప్రాంతానికి రైల్వే లైన్ ఏర్పాటు చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజులను ఆదేశించింది. వారిద్దరూ శని, ఆదివారాల్లో ఈ ప్రాంతంలో పర్యటించి రైల్వే లైన్ గురించి ఇక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు. అంటే దాదాపుగా అనుకూల నిర్ణయం వచ్చే అవకాశాలే ఎక్కువ.
తవాంగ్ నుంచి సుమారుగా 300 కి.మీ. దూరం వెళ్తే భలుక్పాంగ్ రైల్వే స్టేషన్ ఉంది. ఇదే చివరి రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి తవాంగ్ వరకూ రైల్వేలైన్ నిర్మాణం చేపట్టనున్నారు. వైద్యం, ఇతర ప్రధాన అవసరాలకు తవాంగ్ ప్రజలు అసోం రాజధాని గువహటికి రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు మార్గం ద్వారా గువహటి వెళ్లాలంటే 18 గంటల సమయం పడుతుంది. ఇదొక్క రైల్వే లైనే కాదు అరుణాచల్ ప్రదేశ్లో పాసిఘట్ ఎయిర్పోర్ట్, రూపా మధ్య మరో బ్రాడ్గేజ్ రైల్వే లేన్ ఏర్పాటు కోసం కూడా సర్వే నిర్వహించనున్నారు. ఇది ఉత్తర లఖింపూర్- బేమ్- సిలాపతర్ లైన్లో భాగం.
భారత్, చైనా మధ్యలో ఉన్న తవాంగ్ ప్రాంతం తమదేనని, అది టిబెట్లో భాగమని చైనా వాదిస్తోంది. ఈ ప్రాంతంలో భారత నాయకులు, అధికారుల పర్యటనను నిరసిస్తోంది. దలైలామా పర్యటించనుండటం పట్ల కూడా చైనా నిరసన వ్యక్తం చేస్తోంది, బెదిరింపులకు సైతం దిగుతోంది. చైనా నిరసనలను ఏ మాత్రం ఖాతరు చేయని భారత ప్రభుత్వం.. అప్పటి అమెరికా రాయబారి రిచర్డ్ వర్మను ఈ ప్రాంతంలో పర్యటించడానికి అనుమతించింది. టిబెటన్ ఆధ్యాత్మికవేత్త కర్మపా ఓగిన్ ట్రిన్లీ డోర్జీ కూడా గతేడాది అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. మొత్తానికి ఎన్డీయే సర్కారు చైనాకు భలే చెక్ పెడుతోంది కదూ. శభాష్ మోదీజీ.