యాప్నగరం

ముంబయిలో విద్యార్థుల ఆందోళన.. ఆగిన రైళ్లు!

ముంబయిలో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మంగళవారం (మార్చి 20) ఉదయం 7 గంటల నుంచి... వేలాది మంది విద్యార్థులు... ఒక్కసారిగా రైల్వే ట్రాక్ పైకి వచ్చి... పట్టాలపై కూర్చుని నిరసన తెలుపుతుండటంతో పలు రైళ్లు ఆగిపోయాయి.

TNN 20 Mar 2018, 1:10 pm
ముంబయిలో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మంగళవారం (మార్చి 20) ఉదయం 7 గంటల నుంచి... వేలాది మంది విద్యార్థులు... ఒక్కసారిగా రైల్వే ట్రాక్ పైకి వచ్చి... పట్టాలపై కూర్చుని నిరసన తెలుపుతుండటంతో పలు రైళ్లు ఆగిపోయాయి. మతుంగ - ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినల్ మధ్య లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో మొత్తం ట్రాఫిక్ గందరగోళంలో పడటంతో... ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురువుతున్నారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రజలు వ్యక్తిగత వాహనాలతో రోడ్లపైకి రావడంతో అక్కడా... అదే పరిస్థితి నెలకొంది.
Samayam Telugu students call off rail roko protest in mumbai
ముంబయిలో విద్యార్థుల ఆందోళన.. ఆగిన రైళ్లు!


ఇటీవల రైల్వేశాఖ వివిధ ఉద్యోగాల భర్తీకి... నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో రైల్వేలో అప్రెంటిస్ చేసిన వారికి ఎలాంటి రిజర్వేషన్ ప్రకటించకపోవడంతో... విద్యార్థులు 'రైల్ రోకో'కు పిలుపునిచ్చారు... దీంతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నోటిఫికేషన్ ప్రకారం... 20 శాతం కోటా ఎత్తేయాలని.. పరీక్షలో మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా దీనిపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ... రైల్వేశాఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో... విద్యార్థులు రైళ్లను అడ్డుకొని నిరసనకు దిగారు.

రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ ఆందోళనపై...సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో సునీల్ ఉడసి స్పందిస్తూ... 'ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల దృష్ట్యా... విద్యార్థులను రైల్వే ట్రాక్ ఖాళీ చేయాల్సిందిగా... రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జవానులు విద్యార్థులతో మాట్లాడుతున్నారని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.