యాప్నగరం

కుండపోత: ఆటోల్లో స్కూలుకెళ్లి.. పవడవల్లో ఇంటికి!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే.. కర్ణాటకలోని అరేబియా తీర ప్రాంతాలు మాత్రం కుండపోత వర్షంతో తడిసిపోయాయి.

Samayam Telugu 29 May 2018, 6:31 pm
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే.. కర్ణాటకలోని అరేబియా తీర ప్రాంతాలు మాత్రం కుండపోత వర్షంతో తడిసిపోయాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంచనా వేసిన దాని కంటే మూడు రోజుల ముందే రుతుపవాలు కేరళ తీరాన్ని తాకాయి. దీంతో కర్ణాటకలో అరేబియా సముద్రం ఒడ్డునే ఉన్న మంగళూరు, ఉడిపి పట్టణాల్లో కుండపోత వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో మంగళూరులోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు నదులను తలపించాయి.

ఎలాంటి వర్షం లేకపోవడంతో ఉదయం ఆటోల్లో స్కూలుకెళ్లిన పిల్లలు బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వర్షం తగ్గిన తరవాత వారిని పడవల్లో ఎక్కుంచుకుని ఇళ్లకు తరలించారు. రాబోయే 48 గంటల్లో కర్ణాటకలోని మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో బుధవారం కూడా మంగళూరులోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షంతో మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్, దానికి అనుబంధంగా ఉన్న రైల్వే మెయిల్ సర్వీస్ కార్యాలయంలో భారీగా వర్షం నీరు చేరింది. మంగళూరులోని ప్రధాన కూడలిలు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.