యాప్నగరం

చదువుకోవడానికి వెళ్లే పిల్లలతో పనులు... మూటలు మోయించారు.. హెడ్ మాస్టర్లపై వేటు

విద్యాబుద్ధులు నేర్పిస్తారని ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే... విద్యార్థలతో పనులు చేయిస్తున్నారు. వాళ్లని కూలీలుగా మార్చేస్తున్నారు. బీహార్‌లో (Bihar) ఇదే జరిగింది. రెండు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులతో పుస్తకాల బస్తాలను మోయించారు. కనీసం కిలోమీటర్ వాళ్లు మూటలను మోయాల్సి వచ్చింది. ప్రధానోపాధ్యాయులే వారు మూటలు మోయాలని ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకుంది. రెండు స్కూల్ హెడ్ మాస్టర్లను సస్పెండ్ చేసింది. వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారిని కోరింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 25 Sep 2022, 9:22 pm

ప్రధానాంశాలు:

  • బీహార్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఘోరం
  • విద్యార్థులతో పుస్తకాల బస్తాలు మోయించారు
  • స్కూలు హెడ్‌మాస్టర్లను సస్పెండ్ చేశారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bihar students forced to carry stacks
బీహార్‌లో (Bihar) రెండు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులతో (School Students) పుస్తకాల బస్తాలను మోయించారు. ప్రభుత్వ కార్యాలయం నుంచి పుస్తకాల బస్తాలను తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను కోరినట్టు తెలుస్తుంది. సమస్తిపుట్ జిల్లాలో హనుమాన్‌నగర్‌ మిడిల్‌ స్కూల్‌, నారాయణపూర్‌ మిడిల్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలోని విద్యార్థులను తలపై పుస్తకాల మూటలు మోయాల్సిందిగా ఒత్తిడి చేసినట్టు సమాచారం.
వారు చెప్పినట్టుగానే చిన్నారులు... తమ తలలపై పుస్తకాల బస్తాలను మోసుకెళ్లారు. విద్యార్థులు ఆ బరువులతో కిలోమీటరుకుపైగా ప్రయాణించాల్సి వచ్చింది. విద్యార్థులతో పుస్తకాలు పంపించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్టు ఉపాధ్యాయుల్లో ఒకరు ఆరోపించారు. చిన్నారులు పుస్తకాలు మోసిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. విద్యార్థులతో ఎందుకు బలవంతంగా ఈ పనులు చేయించారు..? రిక్షా లేదా బండి అద్దెకు తీసుకోవడానికి పాఠశాలకు తగినంత నిధులు లేవా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో.. అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేశారు.

దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు అధికారులు ఈనెల 23న బీఈవోను వివరణ కోరుతూ లేఖ ఇచ్చారు. హనుమాన్‌నగర్‌ మిడిల్‌ స్కూల్‌ ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు సుచిత్ర రేఖా రాయ్‌, నారాయణపూర్‌ మిడిల్‌ స్కూల్‌ ప్రధాన ఉపాధ్యాయుడు సురేష్‌ పాశ్వాన్‌లను జిల్లా ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ సస్పెండ్‌ చేశారు.

అసలెందుకీ పుస్తకాల మోత...

బీహార్‌లో విద్యాశాఖ చహక్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దానికోసం విద్యా శాఖ కొన్ని పుస్తకాల కట్టలను BRC భవన్ మొహియుద్దీన్‌నగర్‌కు పంపింది. ఇక్కడి నుంచి బీఈవో ఆధ్వర్యంలో ఈ పుస్తకాలను బ్లాక్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని అధికారులు ఆదేశించారు. దీంతో నారాయణపూర్‌ మిడిల్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు తమ పాఠశాలల విద్యార్థులను బీఆర్‌సీ భవన్ నుంచి పుస్తకాల కట్టలను పాఠశాలకు తీసుకురావాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.