యాప్నగరం

మార్కుల వెంట పడొద్దు, జ్ఞానం సంపాదించండి!

విద్యార్థులు మార్కెల వెంట పడేకంటే జ్ఞానం సంపాదించడంపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు.

Samayam Telugu 29 Jan 2017, 11:53 am
విద్యార్థులు మార్కెల వెంట పడేకంటే జ్ఞానం సంపాదించడంపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆదివారం నిర్వహించిన రేడియో కార్యక్రమం-మన్ కీ బాత్ (మనసులో మాట) సందర్భంగా మోదీ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. మార్చి నెల నుంచి పదోతరగతి, ఇంటర్మీడియట్లతో పాటు పలు పోటీ పరీక్షలకు ప్రీపేర్ అవుతున్న విద్యార్థులకు ఆయన సలహాలు, సూచనలిచ్చారు.
Samayam Telugu students should not run after marks says pm modi
మార్కుల వెంట పడొద్దు, జ్ఞానం సంపాదించండి!


‘‘తగినంత విశ్రాంతి తీసుకోండి, వేళకు నిద్రపోండి, శారీరక వ్యాయామం చేయడం ఇవే పరీక్షల సమయంలో మీకు బాగా తోడ్పాటును అందిస్తాయని’’ మోదీ విద్యార్థులకు సూచించారు.

ఇతరులను మోసం చేయకూడదని, అది ఎప్పటికైనా ప్రమాదమని ఆయన హెచ్చరించారు. ఆత్మవిశ్వాసం లేకపోవడమే మోసం చేయడానికి అడ్డదారులను తొక్కేలా చేస్తుందని ఆయన గుర్తు చేశారు.

పిల్లలు సమాజంతో ఎలా మెలగాలో నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణ ఉండేలా చూడాలని చెప్పారు.

‘సచిన్ టెండూల్కర్ ను చూడండి. 20ఏళ్లుగా తన రికార్డును తానే బ్రేక్ చేయడానికి ఇప్పటికీ కృషి చేస్తున్నాడు. ఇతరులకు బదులుగా మిమ్మల్నే మీరే పోటీగా భావించండి. మార్కుల వెంట పడొద్దు. జ్ఞానసమూపార్జనకు ప్రయత్నించండి’’ అని మోదీ పేర్కొన్నారు.

పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుడదని, నిరంతరం నవ్వుతూ అదే విజయం అందిస్తుందని మోదీ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.