పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ, ఆర్టికల్ 377లో దీనికి మినహాయింపు నిస్తూ సుప్రీంకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పుపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి భిన్నంగా స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఆయన, ఇది తుది తీర్పు కాదని, మళ్లీ సవాలు చేయొచ్చని వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు ఇచ్చింది తుది తీర్పు కాదని, ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో తీర్పు మారిపోవచ్చు’ అని స్వామి పేర్కొన్నారు.
స్వలింగ సంపర్కం జన్యుపరమైన లోపం.. దీన్ని సాధారణ లైంగిక ప్రవర్తనతో పోల్చలేం.. ఒకవేళ దీనిని నేరంగా పరిగణించకపోతే సామాజికంగా అనేక సమస్యలు ఎదురవుతాయి... లైంగిక వ్యాధులు సంక్రమిస్తాయని స్వామి అభిప్రాయపడ్డారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వల్ల పెడోఫీలియా, హెచ్ఐవీ కేసులు పెరిగిపోతాయని, గే బార్స్ కూడా ఎక్కువైపోతాయని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. అంతేకాదు చాలా మంది న్యాయమూర్తులు స్వలింగ సంపర్కులేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, పడక గదుల్లోకి పోలీసులకు ప్రవేశించే హక్కులేదని అన్నారు.
స్వలింగ సంపర్కం అంటే సాధారణ విషయం కాదు.. ఇలాంటివి అమెరికన్ల అలవాట్లు.. దీని వెనుక పెద్ద మొత్తంలో డబ్బు ముడిపడి ఉంది.. అమెరికన్లు గే బార్స్ ప్రారంభించడం వల్ల పెడోఫీలియా, హెచ్ఐవీ కేసులు అధిక సంఖ్యలో పెరుగుతాయి.. ఇది జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని స్వామి తెలిపారు. ఇది హిందూత్వ, మన పురాణ ఇతిహాసాలకు పూర్తిగా విరుద్ధం అని దుయ్యబట్టారు.
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించొద్దని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం సంచలన తీర్పును వెలువరించింది. ‘లైంగిక స్వభావం ఆధారంగా ఒకరిపై పక్షపాతం చూపించడమంటే వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లే. ఎల్జీబీటీ వర్గానికి చెందిన వ్యక్తులకు కూడా సాధారణ పౌరులకు ఉండే హక్కులే ఉంటాయి. వారి వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలి. సెక్షన్ 377 సమానత్వ హక్కులను ఉల్లంఘిస్తోంది’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తన తీర్పులో వెల్లడించారు.
స్వలింగ సంపర్కం జన్యుపరమైన లోపం.. దీన్ని సాధారణ లైంగిక ప్రవర్తనతో పోల్చలేం.. ఒకవేళ దీనిని నేరంగా పరిగణించకపోతే సామాజికంగా అనేక సమస్యలు ఎదురవుతాయి... లైంగిక వ్యాధులు సంక్రమిస్తాయని స్వామి అభిప్రాయపడ్డారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వల్ల పెడోఫీలియా, హెచ్ఐవీ కేసులు పెరిగిపోతాయని, గే బార్స్ కూడా ఎక్కువైపోతాయని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. అంతేకాదు చాలా మంది న్యాయమూర్తులు స్వలింగ సంపర్కులేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, పడక గదుల్లోకి పోలీసులకు ప్రవేశించే హక్కులేదని అన్నారు.
స్వలింగ సంపర్కం అంటే సాధారణ విషయం కాదు.. ఇలాంటివి అమెరికన్ల అలవాట్లు.. దీని వెనుక పెద్ద మొత్తంలో డబ్బు ముడిపడి ఉంది.. అమెరికన్లు గే బార్స్ ప్రారంభించడం వల్ల పెడోఫీలియా, హెచ్ఐవీ కేసులు అధిక సంఖ్యలో పెరుగుతాయి.. ఇది జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని స్వామి తెలిపారు. ఇది హిందూత్వ, మన పురాణ ఇతిహాసాలకు పూర్తిగా విరుద్ధం అని దుయ్యబట్టారు.
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించొద్దని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం సంచలన తీర్పును వెలువరించింది. ‘లైంగిక స్వభావం ఆధారంగా ఒకరిపై పక్షపాతం చూపించడమంటే వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లే. ఎల్జీబీటీ వర్గానికి చెందిన వ్యక్తులకు కూడా సాధారణ పౌరులకు ఉండే హక్కులే ఉంటాయి. వారి వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలి. సెక్షన్ 377 సమానత్వ హక్కులను ఉల్లంఘిస్తోంది’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తన తీర్పులో వెల్లడించారు.