యాప్నగరం

మాల్యా వివాదం.. బీజేపీకి సుబ్రమణ్య స్వామి ఝలక్

విజయ్ మాల్యా వివాదంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తలదూర్చారు. బీజేపీని ఇరుకునపెట్టేలా ఆయన ట్వీట్లు చేశారు.

Samayam Telugu 13 Sep 2018, 3:32 pm
దేశం విడిచి వచ్చే ముందు జైట్లీని కలిశానన్న విజయ్ మాల్యా వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన బీజేపీకి.. ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్వీట్లు మరింత చిక్కుల్లోకి నెట్టాయి. తాను లండన్ వెళ్లిపోతున్నానని మాల్యా పార్లమెంటులో అరుణ్ జైట్లీకి చెప్పిన విషయం ‘కాదనలేని వాస్తవం’ అని స్వామి తెలిపారు. 2015 అక్టోబర్ 24న మాల్యాపై విడుదలైన లుక్‌ అవుట్ నోటీసును ప్రభావ రహితంగా మార్చింది కూడా నిజమేనని స్వామి ఘటుగా ట్వీట్ చేశారు.
Samayam Telugu subramanian swamy


రుణాల చెల్లింపుపై జైట్లీతో చర్చించానని మాల్యా చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం చెలరేగుతున్న వేళ.. స్వామి చేసిన ట్వీట్ బీజేపీకి షాకిచ్చేలా ఉంది. ‘2015 అక్టోబర్ 24న జారీ అయిన లుక్ అవుట్ నోటీసును ప్రభావ రహితంగా మార్చారు. బ్లాక్ చేయండి అనే పదాన్ని రిపోర్ట్ అని మార్చడం ద్వారా విజయ్ మాల్యా 54 లగేజీ బ్యాగులతో దర్జాగా తప్పించుకుని వెళ్లడానికి అవకాశం ఇచ్చారు’ అని స్వామి ట్వీట్ చేశారు. తాను లండన్ వెళ్లిపోతున్నానని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఆర్థిక మంత్రికి మాల్యా చెప్పడం వాస్తవమ’ని స్వామి ట్వీట్ చేశారు.
మాల్యాపై సీబీఐ జారీ చేసిన లుక్‌అవుట్ నోటీసును మార్చినట్టు సమాచారం ఉందని బుధవారమే స్వామి ఒక ట్వీట్‌ చేశారు. బ్లాక్ డిపార్చర్ అని సీబీఐ జారీ చేసిన లుక్‌అవుట్ నోటీసును రిపోర్ట్ డిపార్చర్‌గా మార్చినట్టు నాకు సమాచారం ఉంది. ఆర్థిక శాఖ సంబంధీకులెవరో ఇలా ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ఆయన ఎవరు?'' అంటూ స్వామి ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.