యాప్నగరం

మౌనముని అవతారంలో సుబ్రమణ్యస్వామి !

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సుబ్రమణ్య స్వామి ఇక నుంచి సైలెంట్ గా ఉంటారట..

TNN 2 Jul 2016, 12:10 pm
ఢిల్లీ: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్య స్వామి ఇక నుంచి సైలెంట్ గా ఉంటారట.. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. రామమందిరం, చెన్నై సూపర్ కింగ్స్ సహా కొన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉందని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి స్వామి వ్యాఖ్యలు వివాదంగా మారుతున్న తరుణంలో బీజేపీ అధిష్టానమే ఆయన్ను మీడియాకు దూరంగా ఉండాలని కోరినట్లు తెలిసింది.
Samayam Telugu subramanyasvami became silent
మౌనముని అవతారంలో సుబ్రమణ్యస్వామి !


గత కొన్ని రోజులుగా సుబ్రమణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ రాజన్, ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్‌లను లక్ష్యంగా చేసుకొని పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయను తీరుపై ప్రధాని మోడీ పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేయడం.. అనంతరం స్వామితో తమకు సంబంధంలేనట్లుగా బీజేపీ దూరంగా ఉండటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి . తాజాగా ఆయన్ను వివాదాలకు దూరంగా ఉండాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలిసిందే. అందుకే స్వామి ఈ మేరకు ప్రకటన చేసినట్లు తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.