యాప్నగరం

జాధవ్‌కి మద్దతుగా సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం

కుల్‌భూషణ్ జాధవ్‌కి పాకిస్థాన్ విధించిన ఉరి శిక్షని ప్రస్తుతానికి నిలిపివేస్తూ, అంతిమ తీర్పు వెలువడే వరకు..

Samayam Telugu 18 May 2017, 11:24 pm
కుల్‌భూషణ్ జాధవ్‌కి పాకిస్థాన్ విధించిన ఉరి శిక్షని ప్రస్తుతానికి నిలిపివేస్తూ, అంతిమ తీర్పు వెలువడే వరకు వేచిచూడాల్సిందిగా పాకిస్థాన్‌కి అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు జారీచేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఐసీజే ఆదేశాలని స్వాగతిస్తూ భారతీయులు సంతృప్తి వ్యక్తంచేశారు. ఇదిలావుంటే, ఎప్పటికప్పుడు అనేక సామాజిక అంశాలు, ఇతర రాజకీయ పరిణామాలపై తనదైన స్టైల్లో స్పందించే ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలని స్వాగతిస్తూ ఒడిషాలోని పూరీ బీచ్ ఒడ్డున ఓ సైకత శిల్పాన్ని రూపొందించారు.
Samayam Telugu sudarsan pattnaiks sand art on icjs verdict about kulbhushan jadhav
జాధవ్‌కి మద్దతుగా సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం


'సత్యమే వజయతే' అనే నినాదంతో రూపొందించిన ఈ సైకత శిల్పంపై ఇండియా ఈజ్ విత్ యు(భారతదేశం మీకు అండగా నిలుస్తుంది) అని దేశం తరపున జాధవ్‌కి మద్దతు తెలియజేశారు పట్నాయక్. ఎంతో క్లిష్టమైన కేసులో విచారణ ఎదుర్కుంటున్న కుల్‌భూషణ్ జాధవ్‌కి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన ఈ సైకత శిల్పం దేశం దృష్టిని ఆకర్షించింది.
Welcome the #ICJ judgment staying #KulbhushanJadhav execution. My SandArt with message #SatyamevaJayate and India is with you at Puri,Odisha pic.twitter.com/bj7vZ6Syt1— Sudarsan Pattnaik (@sudarsansand) May 18, 2017
ఓవైపు జాధవ్‌కి అండగా యావత్ దేశం నిలుస్తుందని మద్దతు పలుకుతూనే మరోవైపు దేశభక్తిని చాటిచెప్పేలా ఈ శిల్పంపై సుదర్శన్ పట్నాయక్ చెక్కిన త్రివర్ణ పతాకం సైతం చూపరులని ఆకట్టుకుంటోంది.
My SandArt on #KulbhushanJadhav with message #SatyamevaJayate :India is with you at #Puri beach, #Odisha. Jai Hind 🇮🇳 pic.twitter.com/7fAkJtvzp6— Sudarsan Pattnaik (@sudarsansand) May 18, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.