యాప్నగరం

ట్రిపుల్ తలాక్ తీర్పుకు సైకత నీరాజనం..

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతిష్టాత్మక తీర్పును తనదైన శైలిలో ఆహ్వానించారు. ఒడిశాలోని పూరీ తీరంలో ‘ట్రిపుల్ తలాక్’ అంశానికి గుర్తుగా సైకత శిల్పాన్ని..

TNN 22 Aug 2017, 8:39 pm
ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు మంగళవారం (ఆగస్టు 22) సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఈ పద్ధతి చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఖురాన్‌ నియమాలకు తలాక్‌ వ్యతిరేకంగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. దీనిపై పార్లమెంట్‌ ఆరు నెలల్లోగా చట్టం తీసుకురావాలని, అప్పటివరకూ తలాక్‌పై నిషేధం విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Samayam Telugu sudarsan pattnaiks sand art on suprem courts triple talaq judgement
ట్రిపుల్ తలాక్ తీర్పుకు సైకత నీరాజనం..


ట్రిపుల్ తలాక్‌ సమానత్వ హక్కును అతిక్రమిస్తోందని, ఇస్లాం దేశాల్లోనే దీన్ని నిషేధించినప్పుడు భారత్‌లో ఎందుకు కొనసాగించాలని ఈ కేసును విచారించిన చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వీరంతా భిన్న మతాలకు చెందిన వారు కావడం మరో విశేషం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ (సిక్కు), జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌ (క్రైస్తవ), జస్టిస్‌ నారీమన్‌ (పార్శీ), జస్టిస్‌ లలిత్‌ (హిందూ), జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (ముస్లిం)లతో కూడిన ధర్మాసనం తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

వాట్సాప్‌, సోషల్‌మీడియా, పోస్టుకార్డు, న్యూస్‌పేపర్‌ ద్వారా కూడా తలాక్‌ చెప్పి భార్యలకు విడాకులిస్తున్న ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తీర్పు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ప్రగతిశీలక తీర్పుగా అభివర్ణిస్తున్నారు. ముస్లిం మహిళలకు ఏకపక్షంగా, వివక్షాపూరితంగా ఇస్తున్న విడాకుల బెడదకు సుప్రీం ధర్మాసనం తన తీర్పుతో చరమగీతం పాడిందని ప్రశంసించారు.

మరోవైపు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఈ ప్రతిష్టాత్మక తీర్పును తనదైన శైలిలో ఆహ్వానించారు. ఒడిశాలోని పూరీ తీరంలో ‘ట్రిపుల్ తలాక్’ అంశానికి గుర్తుగా సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. దీన్నొక చరిత్రాత్మకమైన తీర్పుగా పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.