యాప్నగరం

యోగా ప్రాధాన్యతని చెబుతున్న సైకత శిల్పం

ఈ బుధవారం జూన్ 21నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాకి వున్న ప్రాధాన్యతని...

Samayam Telugu 21 Jun 2017, 12:45 am
ఈ బుధవారం జూన్ 21నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాకి వున్న ప్రాధాన్యతని తెలియచేస్తూ ప్రముఖ సైకతశిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం చూపరులని విశేషంగా ఆకట్టుకుంటోంది. మానసిక ప్రశాంతతకి ఈ యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటూ ఆ సైకత శిల్పంపై పట్నాయక్ రాసిన రాతలు, వివిధ ఆసనాలతో కూడిన సైకత శిల్పాలు యోగాతో కలిగే ప్రయోజనాలని చెప్పకనే చెబుతున్నాయి.
Samayam Telugu sudarsan pattnaiks sand art to celebrate international yoga day
యోగా ప్రాధాన్యతని చెబుతున్న సైకత శిల్పం

"#Yoga for Harmony & Peace" :Let's join the movement started by Hon @PMOIndia to spread #Yoga far and wide; My SandArt for #IDY2017 at #Puri pic.twitter.com/3DRPHlquU0— Sudarsan Pattnaik (@sudarsansand) June 20, 2017
ప్రధాని నరేంద్ర మోడీ మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని మనం ప్రపంచం నలుమూలలకి తీసుకువెళ్దాం రండి అంటూ సుదర్శన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. ఒడిషాలోని పూరి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన ఈ సైకత శిల్పం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

ఎప్పటికప్పుడు అనేక సామాజిక అంశాలు, ఇతర రాజకీయ పరిణామాలపై తనదైన స్టైల్లో స్పందించే సుదర్శన్ పట్నాయక్ అంతర్జాతీయ స్థాయిలోనూ పలు పోటీల్లో పాల్గొని వరుసగా ఛాంపియన్‌షిప్ టైటిల్స్ సొంతం చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.