యాప్నగరం

గో గ్రీన్ గణేషా.. పూరీ బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం

వినాయక చవితి సందర్భంగా పూరీ బీచ్‌లో అద్భుత కళా ఖండాన్ని ఆవిష్కరించిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.

Samayam Telugu 13 Sep 2018, 5:02 pm
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎలాంటి విఘ్నాలు లేకుండా చల్లగా చూడంటూ ఆ బొజ్జ గణపయ్యకు అందరూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. పూరి బీచ్‌లో 20 అడుగుల మహాగణపతి సైకత శిల్పాన్ని రూపొందించారు.
Samayam Telugu Ganesh


మహాగణపతి సైకత శిల్పంతో పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశాన్ని కూడా ఇచ్చారు. గో గ్రీన్ గణేషా అంటూ ప్లాస్టిక్ పొల్యూష‌న్‌ను తరిమేద్దామని పిలుపునిచ్చారు. మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని రక్షించాలని తన సైకత శిల్పం ద్వారా కోరారు. సుదర్శన్ పట్నాయక్ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఈ శిల్పం అందర్ని ఆకట్టుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.