యాప్నగరం

అతిలోక సుందరికి అద్భుత నివాళి

శ్రీదేవి మరణం పట్ల ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో నివాళి అర్పించారు.

TNN 25 Feb 2018, 6:19 pm
ప్రముఖ నటి శ్రీదేవి మరణం పట్ల దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే ఆమె మరణ వార్త విని షాకయ్యామని.. ఆమెతో కలిసి నటించిన చిరంజీవి, కృష్ణ లాంటి నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, హిందీ చిత్ర రంగాల ప్రముఖులే కాకుండా.. రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు కూడా శ్రీదేవి హఠాన్మరణం వార్తతో షాకయ్యారు. అతిలోక సుందరి శ్రీదేవి మరణానికి సంతాప సూచికగా... ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తనదైన రీతిలో నివాళులు అర్పించారు.
Samayam Telugu sudarshan patnaik tribute to sridevi with his sand art
అతిలోక సుందరికి అద్భుత నివాళి



పూరీ తీరంలో శ్రీదేవి సైకత శిల్పం రూపొందించిన పట్నాయక్.. మేం నిన్ను మిస్సవుతాం. రిప్ శ్రీదేవి అంటూ నివాళి అర్పించాడు. ఆమె సినీ ప్రస్థానానికి సూచికగా.. ఈ శిల్పాన్ని పట్నాయక్ తీర్చిదిద్దాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.