యాప్నగరం

చెరకుతో డయాబెటిస్, సాగు తగ్గించండి: యూపీ సీఎం

చెరకు వల్ల డయాబెటిస్ వస్తుంది. కాబట్టి ఈ పంటను ఎక్కువగా సాగు చేయడం తగ్గించండి. బదులుగా కూరగాయలు సాగు చేయండని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రైతాంగానికి సలహా ఇచ్చారు.

Samayam Telugu 12 Sep 2018, 1:40 pm
చెరకును ఎక్కువగా పండించే ఉత్తర ప్రదేశ్ రైతాంగానికి ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ సూచన చేశారు. చెరకు సాగు వదలిపెట్టి ఇతర పంటల వైపు మళ్లాలని ఆయన సూచించారు. ఎందుకో తెలుసా..? చెరకును అధికంగా ఉత్పత్తి చేస్తే.. వాడకం పెరిగిపోయి అది డయాబెటిస్‌కు దారి తీస్తుందట. అందుకే ఆయన ఈ సలహా ఇచ్చారు. బాఘ్‌పట్ ప్రాంతం చెరకు పంటకు ప్రసిద్ధి చెందింది. అక్కడ నిర్వహించిన సమావేశంలోనే ప్రజలను ఉద్దేశించి యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu yogi adityanath


కేవలం చెరకు మాత్రమే సాగు చేయడం ఆపేసి, కూరగాయల్లాంటి ఇతర పంటలు పండించండి. చక్కెరను అతిగా తింటే డయాబెటిస్ వస్తుంది. ఈ మధ్య రైతులు ఎక్కువగా చెరకు పండిస్తున్నారంటూ యోగి మాట్లాడారు.

చెరకు మిల్లులు రైతాంగానికి బకాయిపడిన రూ.26 వేల కోట్లను చెల్లించామని చెప్పిన యోగి.. మిగతా రూ.10 వేల కోట్లను త్వరలో చెల్లించేలా చూస్తామన్నారు. అక్టోబర్ 15లోగా చెరకు మిల్లులు బకాయిలు చెల్లించకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.