మాజీ మంత్రి శశి థరూర్ సతీమణి సునందా పుష్కర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘నాకు బతకాలన్న ఏ కోరికా లేదు’ అంటూ సునంద తన భర్త థరూర్కు తాను చనిపోయే వారం రోజుల ముందు సుదీర్ఘ మెయిల్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం (మే 28) కోర్టులో తెలిపారు. కోర్టులో సమర్పించిన ఛార్జిషీట్లో ఈ మేరకు పేర్కొ్న్నారు. భార్య సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకునేలా థరూర్ ప్రేరేపించారని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో సునంద చేసిన ట్వీట్లు, మెయిల్స్, మెసేజ్లే ఆమె మరణ వాంగ్మూలం కింద తీసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. శశి థరూర్ నిందితుడని రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయని వెల్లడించారు.
‘నాకు జీవించాలన్న కోరిక లేదు.. చావు కోసం ఎదురు చూస్తున్నా’ అంటూ జనవరి 8న సునంద, థరూర్కు ఇ-మెయిల్ చేసిందని, ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్కు చెందిన సూట్లో ఆమె మరణించడానికి 9 రోజుల ముందు ఈ మెయిల్ చేసినట్లు ఛార్జిషీటులో పేర్కొన్నారు. పాయిజనింగ్ కారణంగానే ఆమె మృత్యువాతపడ్డట్లు తెలిపారు.
సునంద బస చేసిన హోటల్ రూంలో 27 అల్ప్రాక్స్ టాబ్లెట్లు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సునంద పుష్కర్ డిప్రెషన్లోకి వెళ్లినా.. ఒక భర్తగా శశి థరూర్ పట్టించుకోలేదని, అందుకే ఆమె అల్ప్రాక్స్ టాబ్లెట్ మింగిందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ఛార్జిషీటులో పేర్కొంది.
థరూర్కు, పాకిస్థాన్ జర్నలిస్ట్తో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం సునందకు కలగడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ విషయమై ట్విటర్లో యుద్ధం కూడా జరిగింది. సునంద కాల్ చేస్తే.. థరూర్ డిస్కనెక్ట్ చేయడం, అసలు పట్టించుకోకపోవడం కూడా చేశాడని ఛార్జిషీటులో సిట్ పేర్కొంది.
సునంద, థరూర్ దంపతులిద్దరూ తరచూ కొట్లాడుకునేవారని, ఆమె ఒంటిపై గాయాలు అంత తీవ్రమైనవి కానప్పటికీ తరచూ వాదులాడుకునేవారని ఛార్జిషీటులో సిట్ వెల్లడించింది. ఆమె యాంటీ డిప్రెషన్ టాబ్లెట్లు కూడా వాడేదని తెలిపారు. మరోవైపు.. శశి థరూర్ తాను భార్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించానని ఛార్జిషీటు దాఖలు చేయడం అర్థరహితమని వ్యాఖ్యానించారు.
థరూర్, సునంద పుష్కర్ వివాహం 2010లో జరిగింది. థరూర్కు సునంద మూడో భార్య కాగా.. సునందకు శశి థరూర్ కూడా మూడో భర్తే కావడం గమనార్హం. వివాహమైన నాలుగేళ్లకే సునంద అనుమానాస్పద స్థితిలో మరణించింది. 2014లో జరిగిన ఈ ఘటన దేశ రాజకీయాల్లో సంచలనానికి కారణమైంది.
సోషల్ మీడియాలో సునంద చేసిన ట్వీట్లు, మెయిల్స్, మెసేజ్లే ఆమె మరణ వాంగ్మూలం కింద తీసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. శశి థరూర్ నిందితుడని రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయని వెల్లడించారు.
‘నాకు జీవించాలన్న కోరిక లేదు.. చావు కోసం ఎదురు చూస్తున్నా’ అంటూ జనవరి 8న సునంద, థరూర్కు ఇ-మెయిల్ చేసిందని, ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్కు చెందిన సూట్లో ఆమె మరణించడానికి 9 రోజుల ముందు ఈ మెయిల్ చేసినట్లు ఛార్జిషీటులో పేర్కొన్నారు. పాయిజనింగ్ కారణంగానే ఆమె మృత్యువాతపడ్డట్లు తెలిపారు.
సునంద బస చేసిన హోటల్ రూంలో 27 అల్ప్రాక్స్ టాబ్లెట్లు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సునంద పుష్కర్ డిప్రెషన్లోకి వెళ్లినా.. ఒక భర్తగా శశి థరూర్ పట్టించుకోలేదని, అందుకే ఆమె అల్ప్రాక్స్ టాబ్లెట్ మింగిందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ఛార్జిషీటులో పేర్కొంది.
థరూర్కు, పాకిస్థాన్ జర్నలిస్ట్తో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం సునందకు కలగడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ విషయమై ట్విటర్లో యుద్ధం కూడా జరిగింది. సునంద కాల్ చేస్తే.. థరూర్ డిస్కనెక్ట్ చేయడం, అసలు పట్టించుకోకపోవడం కూడా చేశాడని ఛార్జిషీటులో సిట్ పేర్కొంది.
సునంద, థరూర్ దంపతులిద్దరూ తరచూ కొట్లాడుకునేవారని, ఆమె ఒంటిపై గాయాలు అంత తీవ్రమైనవి కానప్పటికీ తరచూ వాదులాడుకునేవారని ఛార్జిషీటులో సిట్ వెల్లడించింది. ఆమె యాంటీ డిప్రెషన్ టాబ్లెట్లు కూడా వాడేదని తెలిపారు. మరోవైపు.. శశి థరూర్ తాను భార్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించానని ఛార్జిషీటు దాఖలు చేయడం అర్థరహితమని వ్యాఖ్యానించారు.
థరూర్, సునంద పుష్కర్ వివాహం 2010లో జరిగింది. థరూర్కు సునంద మూడో భార్య కాగా.. సునందకు శశి థరూర్ కూడా మూడో భర్తే కావడం గమనార్హం. వివాహమైన నాలుగేళ్లకే సునంద అనుమానాస్పద స్థితిలో మరణించింది. 2014లో జరిగిన ఈ ఘటన దేశ రాజకీయాల్లో సంచలనానికి కారణమైంది.