యాప్నగరం

‘సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేశాకే.. మంత్రులు క్వార్టర్స్‌‌లోకి వెళ్లండి’

సీఎం సాబ్.. ముందుగా సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయించాకే మంత్రులను క్వార్టర్స్‌లోకి వెళ్లనీయండి - త్రిపుర సీఎంకు సునీల్ దియోదర్ సలహా.

Samayam Telugu 10 Mar 2018, 4:29 pm
‘సెప్టిక్ ట్యాంక్‌లు క్లీన్ చేయించాకే.. మంత్రులకు కేటాయించిన క్వార్టర్స్‌లోకి వెళ్లండి.’ త్రిపుర కొత్త మంత్రివర్గానికి, సీఎం పగ్గాలు చేపట్టిన విప్లవ్ దేవ్‌కు ఆరెస్సెస్ నేత సునీల్ దియోదర్ ఇస్తోన్న సలహా ఇది. మోదీ స్వచ్ఛ్ భారత్ కోసం ఇలాంటి సలహా ఇచ్చారని మాత్రం అనుకోవద్దు. త్రిపురలో 25 ఏళ్ల లెఫ్ట్ పాలనకు చరమ గీతం పాడి బీజీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని ఓడించడంలో సునీల్ దియోదర్ కీలక పాత్ర పోషించారు.
Samayam Telugu sunil deodhar asked tripura cm to get septic tanks of all minister quarters cleaned
‘సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేశాకే.. మంత్రులు క్వార్టర్స్‌‌లోకి వెళ్లండి’


అలాంటి వ్యక్తి త్రిపుర మంత్రివర్గానికి ఇలాంటి సలహా ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ‘‘2005లో మాణిక్ సర్కార్ క్వార్టర్స్‌లోని సెప్టిక్ ట్యాంక్‌లో ఓ మహిళ అస్థిపంజరం లభ్యమైంది. పాతికేళ్ల పాలనలో ఎన్నో రాజకీయ హత్యలు జరిగాయి. అందుకే మంత్రుల క్వార్టర్స్‌లోకి చేరే ముందు అక్కడి సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేయమని విప్లవ్ దేవ్‌ను కోరాన’ని సునీల్ దియోదర్ ట్వీట్ చేశారు.

I request @BjpBiplab, new CM of Tripura, to get septic tanks of all minister quarters cleaned before occupying them. It should be recollected that a woman’s skeleton was found in septic tank of Ex CM Manik Sarkar's quarter on Jan 4, 2005 but the case was deliberately suppressed. — Sunil Deodhar (@Sunil_Deodhar) March 10, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.