యాప్నగరం

ఆ ఉగ్రవాదులు 'పాక్' నుంచే వచ్చారు..!

జమ్మూకశ్మీర్‌లోని సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై దాడి జరిపిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చినట్లు ఆర్మీ అధికారులు నిర్దారణకు వచ్చారు. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు పాక్ రేంజర్ల సాయంతోనే భారత్‌లోకి ప్రవేశం.

tnn 17 Feb 2018, 1:14 pm
జమ్మూకశ్మీర్‌లోని సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై దాడి జరిపిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చినట్లు ఆర్మీ అధికారులు నిర్దారణకు వచ్చారు. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు పాక్ రేంజర్ల సాయంతో... గతేడాది జూన్ నెలలోనే భారత్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. వీరు ఏడు నెలలపాటు జమ్మూకశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు పేర్కొన్నారు. వీరేకాక ఇతర ఉగ్రవాదులు కూడా భారత్‌లోకి ప్రవేశించడానికి పాక్ రేంజర్లు కొమ్ముకాస్తున్నారని తెలిపారు. వీరంతా.. భారత్‌పై దాడి చేయడానికి అదను కోసం ఎదురుచూస్తున్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
Samayam Telugu sunjuwan camp attackers came from pakistan
ఆ ఉగ్రవాదులు 'పాక్' నుంచే వచ్చారు..!



ఫిబ్రవరి 10న తెల్లవారుజామున 'సుంజ్వాన్' ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఆరుగురు సైనికులతోపాటు, ఒక పౌరుడు ఉన్నాడు. దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.