ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో కొత్త సబ్జెక్టుపై చర్చించారు. ‘మానసిక ఒత్తిడి’ అనే అంశంపై మాట్లాడారు.
‘‘మనం డిప్రెషన్ గురించి బహాటంగా చర్చించడానికి భయపడతాం. మానసిక ఒత్తిడికి గురవుతూ కుంగిపోవడం మంచిది కాదు. వ్యక్తికరణ అనేది ఎప్పటికీ మంచిది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వాళ్లు తమ బాధలు ఇతరులతో పంచుకుంటే అంది ఎంతో ఉపశమనం కల్గిస్తుంది’’ అని మోదీ అన్నారు.
ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినం జరుగనుంది. భారత్ లో 36శాతం మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 322 మిలియన్ల మంది జనం మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు వివరించింది.
అయితే భారత్ లో ఉమ్మడి కుటంబ వ్యవస్థ ఇంకా బలంగా ఉండటం వల్ల ఒకరి కష్టసుఖాలు మరొకరితో చెప్పుకోవడానికి వీలుంటుందని, ఈ విషయంలో మనం అదృష్టవంతులమని మోదీ అన్నారు. అయితే దూర ప్రాంతాల్లో ఉంటున్న యువత కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కొన్నిసార్లు డిప్రెషన్ కు గురవుతారని...వారి ఇబ్బందులు చెప్పుకోవడానికి తన వాళ్లు దగ్గరుండాలని భావిస్తారని ఆయన గుర్తు చేశారు.
‘‘డిప్రెషన్ ను జయించవచ్చు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వాళ్లను ఆ రుగ్మత నుంచి బయటపడేయవచ్చు. ఒత్తిడికి గురైనప్పుడు మీ ఫీలింగ్స్ ఇతరులతో పంచుకోవడం మంచిది’’ అని మోదీ సూచించారు.
‘‘మనం డిప్రెషన్ గురించి బహాటంగా చర్చించడానికి భయపడతాం. మానసిక ఒత్తిడికి గురవుతూ కుంగిపోవడం మంచిది కాదు. వ్యక్తికరణ అనేది ఎప్పటికీ మంచిది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వాళ్లు తమ బాధలు ఇతరులతో పంచుకుంటే అంది ఎంతో ఉపశమనం కల్గిస్తుంది’’ అని మోదీ అన్నారు.
ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినం జరుగనుంది. భారత్ లో 36శాతం మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 322 మిలియన్ల మంది జనం మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు వివరించింది.
అయితే భారత్ లో ఉమ్మడి కుటంబ వ్యవస్థ ఇంకా బలంగా ఉండటం వల్ల ఒకరి కష్టసుఖాలు మరొకరితో చెప్పుకోవడానికి వీలుంటుందని, ఈ విషయంలో మనం అదృష్టవంతులమని మోదీ అన్నారు. అయితే దూర ప్రాంతాల్లో ఉంటున్న యువత కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కొన్నిసార్లు డిప్రెషన్ కు గురవుతారని...వారి ఇబ్బందులు చెప్పుకోవడానికి తన వాళ్లు దగ్గరుండాలని భావిస్తారని ఆయన గుర్తు చేశారు.
‘‘డిప్రెషన్ ను జయించవచ్చు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వాళ్లను ఆ రుగ్మత నుంచి బయటపడేయవచ్చు. ఒత్తిడికి గురైనప్పుడు మీ ఫీలింగ్స్ ఇతరులతో పంచుకోవడం మంచిది’’ అని మోదీ సూచించారు.