యాప్నగరం

Divorce: రాత్రొకరు.. పగలొకరు ఉద్యోగాలు.. దాంపత్యానికి టైమెక్కడిది?: టెక్కీ విడాకుల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Divorce దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. అయితే వీరిలో ఒకరు ఉదయం ఉద్యోగానికి వెళ్తే.. ఇంకొకరు రాత్రి విధులకు వెళ్తుంటారు. మనస్ఫర్ధలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. అయితే, వైవాహిక బంధాన్ని నిలుపుకోడానికి మరో అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ఆ జంటను సుప్రీం న్యాయమూర్తులు ప్రశ్నించారు. భార్యాభర్తలుగా కలిసి ఉండటానికి సమయం కేటాయించలేకపోతున్న మీరు పెళ్లి బంధాన్ని ఎందుకు నిలబెట్టుకోడానికి ప్రయత్నం చేయలేదని నిలదీసింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 24 Apr 2023, 11:15 am

ప్రధానాంశాలు:

  • విడాకుల కోసం సుప్రీంకోర్టు టెక్కీ దంపతులు
  • రెండో అవకాశం ఎందుకివ్వరన్న న్యాయమూర్తులు
  • పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని సమాధానం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Supreme Court
కర్ణాటకకు చెందిన ఓ జంట విడాకుల కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తలుగా కలిసి ఉండటానికి సమయం కేటాయించలేకపోతున్న మీరు మీ వైవాహిక బంధాన్ని నిలబెట్టుకునేందుకు మరో అవకాశం ఎందుకు ఇవ్వలేకపోతున్నారని సాఫ్ట్‌వేర్ జంటను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘‘బెంగళూరులో మీ ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. ఒకరు పగలు ఉద్యోగానికి వెళ్తే..మరొకరు రాత్రి వెళ్తున్నారు.. మీకు దాంపత్యానికి సమయమేది? విడాకులు తీసుకోవడంపై మీకు విచారంలేదు. అయినప్పటికీ పెళ్లి బంధాన్ని నిలుపుకోవడానికి రెండో అవకాశం ఎందుకు తీసుకోరు’’ అంటూ జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించారు.
‘తిరిగి కలిసుండేందుకు ఈ జంటకు ఓ అవకాశం ఇవ్వాలి’’ అని జస్టిస్‌ నాగరత్న సూచించారు. అయితే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు నిశ్చయించుకుని ఓ ఒప్పందానికి వచ్చారని వారి తరఫు లాయర్లు ధర్మాసనానికి తెలిపారు. దీంతో ఆ జంటకు సుప్రీం కోర్టు విడాకులు మంజూరు చేసింది. శాశ్వత భరణంగా భార్యకు చివరి సెటిల్‌మెంట్ కోసం మొత్తం రూ. 12.51 లక్షలను చెల్లించాలనేది నిబంధనలలో ఒకటి అని ధర్మాసనానికి న్యాయవాదులు తెలియజేశారు.

‘ఈ కోర్టు ప్రశ్నించినప్పుడు పరస్పర అంగీకారంతో విడిపోవడం, విడాకులు కోరడం ద్వారా తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి అంగీకరించామని పార్టీలు పేర్కొన్నాయి.. అలాగే సెటిల్‌మెంట్ షరతులు కూడా ఉన్నాయి.. వీటికి కట్టుబడి పరస్పర అంగీకారంతో విడాకుల డిక్రీ ద్వారా వివాహం రద్దవుతుంది’ అని ఏప్రిల్ 18 నాటి ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది.

‘మేము సెటిల్‌మెంట్ ఒప్పందాన్ని అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద దాఖలు చేసిన దరఖాస్తును నమోదు చేశాం... మా పరిశీలనలో సెటిల్‌మెంట్ ఒప్పందాల నిబంధనలు చట్టబద్ధమైనవని, వాటిని అంగీకరించడానికి ఎటువంటి చట్టపరమైన అవరోధం లేదని గుర్తించాం’ అని వ్యాఖ్యానించింది.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.