యాప్నగరం

తాగి వాహనం నడిపితే ఇక జైలుకే..

మొబైల్ ఫోన్ మాట్లాడుతూనో, ఫూటుగా పీకల్లోతు మద్యం సేవించో వాహనాలు నడిపే వారికి ఇక రానున్నవి గడ్డు రోజులే

TNN 21 Sep 2016, 10:55 pm
మొబైల్ ఫోన్ మాట్లాడుతూనో, ఫూటుగా పీకల్లోతు మద్యం సేవించో వాహనాలు నడిపే వారికి ఇక రానున్నవి గడ్డు రోజులే. ఈ తరహా నిర్లక్ష్యపు డ్రైవింగులకు భారీ జరిమానాలు, జైలు శిక్షలకు రంగం సిద్ధమవుతోంది. దీనికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర వాహనాల చట్టాన్ని సవరించే అంశంపై జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రభుత్వ వాదనను సమర్ధించింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల సదరు వ్యక్తులు తమ ప్రాణాలతో పాటు, ఏ పాపం ఎరుగని ఇతరుల ప్రాణాలను కూడా బలిగొంటున్నారని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పారు. ఈ తరహా కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు విధించే అవకాశం ప్రస్తుతమున్న చట్టాల్లో లేదని చెప్పారు. వాహనచోదకులు బాధ్యతాయుతంగా వాహనాలు నడిపేందుకు పురికొలిపేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరముందన్న రోహత్గీ వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. నిర్లక్ష్యపు డ్రైవర్లకు కేవలం జరిమానాలు విధించి వదిలివేసే దోరణి పోవాలని ధర్మాసనం అభిప్రాయపడింది. వాహనాల చట్టంలోని 184 సెక్షన్ ప్రకారం శిక్షించే యోచన సబబేనంది.
Samayam Telugu supreme court agrees with union govt for implementing road safety act
తాగి వాహనం నడిపితే ఇక జైలుకే..


తాజాగా తీసుకురావాలని యోచిస్తున్న చట్టం ప్రకారం, ఎవరైనా నిబంధనలను మీరి డ్రైవ్ చేసి తొలిసారి పట్టుపడితే రూ.1000 జరిమానాను, ఆరునెలల జైలు శిక్షను విధిస్తారు. రెండోసారి అయితే రూ. 2వేలు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.