యాప్నగరం

పౌరహక్కుల నేతలకు 12 వరకు గృహనిర్భందం

ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో అరెస్ట్ చేసి గృహనిర్భందంలో ఉంచిన పౌరహక్కుల నేతల గృహనిర్భందాన్ని సెప్టెంబరు 12 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది.

Samayam Telugu 7 Sep 2018, 11:39 am
భీమా కొరెగావ్ విచారణ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలపై విరసం నేత వరవరరావుతో పాటు మరో ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తల గృహనిర్భంధాన్ని సెప్టెంబరు 12 వరకు కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు గురించి పుణే అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సాక్ష్యాధారాలు బయటపెట్టడంపై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ లు ఏఎం ఖాన్విల్కర్, డివై చంద్రచూడ్ లతో కూడిన ధర్మసనం మండిపడింది. దీనిపై మహారాష్ట్ర తరపున విచారణకు హజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా క్షమాపణ చెప్పారు.
Samayam Telugu suprem


ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే.
అందులో భాగంగా విరసం నేత వరవర రావుతో పాటు మరో నలుగురు పౌరహక్కుల నేతలను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల‌తో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించి సెప్టెంబరు 6 వరకు గృహనిర్భంధంలో ఉంచారు. ఈ గృహనిర్భంధాన్ని సుప్రీం కోర్టు 12 వరకు పొడిగించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.