పశువుల్ని వ్యవసాయానికి తప్ప ఇతర ఏ అవసరాల కోసం (మాంసం కోసం) అమ్మరాదని ఇటీవల కేంద్రం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై రెండు వారాల్లో స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 11న చేపట్టాలని నిర్ణయించింది.
పశువుల అమ్మకాలపై కేంద్రం విధించిన నిషేదాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన ఓ స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్రం వివరణ విన్న తర్వాతే ఈ అంశంపై తగు నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ ఆర్కె అగర్వాల్, ఎస్ కే కౌల్ ల ధర్మాసనం స్పష్టం చేసింది.
దేశమంతా పశువుల అమ్మకాలు, కొనుగోలుపై నియంత్రణ ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్రం తరఫున అడిషనల్ సొలిటర్ జనరల్ పీఎస్ నరసింహ్మా హాజరై వివరించారు.
కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గళమెత్తిన సంగతి తెలిసిందే.
పశువుల అమ్మకాలపై కేంద్రం విధించిన నిషేదాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన ఓ స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్రం వివరణ విన్న తర్వాతే ఈ అంశంపై తగు నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ ఆర్కె అగర్వాల్, ఎస్ కే కౌల్ ల ధర్మాసనం స్పష్టం చేసింది.
దేశమంతా పశువుల అమ్మకాలు, కొనుగోలుపై నియంత్రణ ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్రం తరఫున అడిషనల్ సొలిటర్ జనరల్ పీఎస్ నరసింహ్మా హాజరై వివరించారు.
కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గళమెత్తిన సంగతి తెలిసిందే.