యాప్నగరం

నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఉరి శిక్ష అమలు ఒక్క రోజు ముందు నిర్భయ దోషి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. పదే పదే వయసు గురించి పిటిషన్ దాఖలు చేయడం సరికాదని పేర్కొంది.

Samayam Telugu 31 Jan 2020, 5:01 pm
ఉరి అమలుకు ఒక్క రోజు ముందు నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తన జువైనల్ పిటిషన్‌ను గతంలో సుప్రీం కోర్టు కోట్టివేయగా.. ధర్మాసనం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అతడు అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. 2012లో నిర్భయను రేప్ చేసే సమయానికి తాను మైనర్‌ను అని పవన్ వాదించాడు. ఇదే విషయమై గతంలో హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని కొట్టివేసింది. ఇప్పుడు కూడా అదే తరహా తీర్పును సుప్రీం వెల్లడించింది.
Samayam Telugu supreme court


ఈ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో తాము పిటిషన్‌ను తిరస్కరించామని.. వయసు గురించి పదే పదే పిటిషన్ వేయడం సరికాదని తెలిపింది. ఇప్పటి వరకూ నిర్భయ దోషులు ముగ్గురు వేర్వురుగా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

డెత్ వారంట్ ప్రకారం నిర్భయ దోషులను శనివారం ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాల్సి ఉంది. ఉరి శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేటి సాయంత్రానికి రిజర్వ్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.