యాప్నగరం

బాబ్రీ కూల్చివేత: అద్వానీకి చిక్కులు తప్పవా?

బాబ్రీ మసీదు కూల్చివేత కేసును మార్చి 22న విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

Samayam Telugu 6 Mar 2017, 3:48 pm
బాబ్రీ మసీదు కూల్చివేత కేసును మార్చి 22న విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అంతేకాదు ఈ ఇదే అంశంపై అలహాబాద్, రాయ్ బరేలీ కోర్టుల్లో కొనసాగుతున్న వివిధ కేసులను కలిపి విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, ఉమాభారతి వంటి వారి ప్రమేయాన్ని నిర్ధార్తిస్తూ తుది తీర్పు వెలువడొచ్చని తెలిసింది.,
Samayam Telugu supreme court takes up the babri case hearing on march 22
బాబ్రీ కూల్చివేత: అద్వానీకి చిక్కులు తప్పవా?


జస్టిస్ పీసీ ఘోష్, ఆర్ఎఫ్ నారిమన్ ల ధర్మాసనం సోమవారం బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సమాలోచనలు జరిపింది. ఇప్పటికే ఈ కేసు విచారణ ఆలస్యమైందని భావిస్తున్న ధర్మాసనం మార్చి 22న తుది తీర్పు వెలువరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత జరుగుతున్నప్పుడు బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, అప్పటి యూపీ సీఎం, ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ లు అక్కడే ఉన్నారని...మసీదు కూల్చివేతలో వీరి ప్రమేయం ఉందని సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే దాదాపు 19 మందికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ నేతలను బాబ్రీకేసులో అలాహాబాద్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యాధినేత బాబర్ బాబ్రీ మసీదును కట్టించారు. అయితే ఇదే ప్రాంతంలో ఇక్కడ రామ మందిరం (అయోధ్య) ఉందని వీహెచ్ పీ, ఆరెస్సెస్, బీజేపీలు వాదిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.