యాప్నగరం

త్వరలోనే సుప్రీం కోర్టులో పేపర్‌లెస్ పిటిషన్స్!

కాగితపు పత్రాలు లేకుండా కోర్టుల్లో కేసులు వాదనకి రావడాన్ని ఊహించుకోవడం ఒకింత క్లిష్టమైన అంశమే. కానీ

TNN 23 Mar 2017, 1:12 pm
కాగితపు పత్రాలు లేకుండా కోర్టుల్లో కేసులు వాదనకి రావడాన్ని ఊహించుకోవడం ఒకింత క్లిష్టమైన అంశమే. కానీ బుధవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ చేసిన వ్యఖ్యలు చూస్తోంటే, రానున్న కాలంలో అది నిజం కానుందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న ఆరు, ఏడు నెలల్లో నమోదయ్యే పిటిషన్లు, వాటితో జత చేసే సంబంధిత డాక్యుమెంట్లలో పేపర్ వినియోగానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నట్టు బుధవారం ఖేహర్ ప్రకటించారు.
Samayam Telugu supreme court to go paperless cji khehar
త్వరలోనే సుప్రీం కోర్టులో పేపర్‌లెస్ పిటిషన్స్!


సుప్రీం కోర్ట్ రూమ్ నెంబర్ 1లో లాయర్లతో మాట్లాడుతూ.. ఇకపై సుప్రీం కోర్టే ట్రయల్ కోర్టులు, హై కోర్టుల నుంచి పిటిషన్లకి సంబంధించిన డాక్యుమెంట్లని ఎలక్ట్రానిక్ రూపంలో తెప్పించుకోనున్నట్టు స్పష్టంచేశారు. తద్వారా ఆయా డాక్యుమెంట్ల ప్రతులతో ఇక అవసరం వుండబోదు అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. 'కింది కోర్టుల తీర్పుని సవాలు చేస్తూ, ఏ న్యాయం కోసమైతే కోర్టుని ఆశ్రయిస్తున్నారో, కేవలం దానిని మాత్రమే కోర్టులో దాఖలు చేస్తే సరిపోతుంది' అని ఖేహర్ పేర్కొన్నట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.