యాప్నగరం

ఉద్యోగులకు హోండా యాక్టివాలను బహుకరించిన వ్యాపారి!

తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సామర్థ్యాన్ని అభినందిస్తూ ఓ వ్యాపారికి వారికి టూవీలర్స్‌ను కానుకగా ఇచ్చారు.

TNN 21 Apr 2017, 1:25 pm
తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సామర్థ్యాన్ని అభినందిస్తూ ఓ వ్యాపారికి వారికి టూవీలర్స్‌ను కానుకగా ఇచ్చారు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి లక్ష్మీదాస్ వెకారియా మంచి పనితీరు కనబరిచిన 125 మంది ఉద్యోగులకు హోండా యాక్టివా 4 జి స్కూటర్లును బహుమతిగా ఇచ్చారు. దీంతో ఉద్యోగులకు ఖరీదైన కానుకలు అందజేసిన గుజరాత్‌కు చెందిన రెండో వ్యాపారిగా ఆయన నిలిచారు.నోట్ల రద్దు, ఆర్థిక ఆంక్షలు లాంటి అడ్డంకులను అధగమించి మంచి ఫలితాలను సాధించారని ఉద్యోగులను అభినందిస్తూ వారికి కానుకలు అందించారు.
Samayam Telugu surat diamond trader gifts employees scooters for doing well despite sluggish economy
ఉద్యోగులకు హోండా యాక్టివాలను బహుకరించిన వ్యాపారి!


అర్థిక మందగమనంలోనూ ఉత్తమ ఫలితాలు రాబట్టడానికి ఉద్యోగులు కృషిచేశారని కొనియాడుతూ ఇతరులకు కూడా రివార్డులను అందజేశారు. లక్ష్మీదాస్ వెకారియా సంస్థలో సుమారు 5,500 మంది విధులు నిర్వహిస్తున్నారు. వారికి బహుమతుల కోసం ఆయన రూ.50 కోట్ల కేటాయించినట్లు సమాచారం. వెకారియా 2010లో వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సూరత్‌ను భారతదేశపు వజ్రాల కేంద్రంగా పేర్కొంటారు. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా వజ్రాల వ్యాపారం ఇక్కడ సాగుతుంది. వజ్రాల కటింగ్, పాలిషింగ్ పరిశ్రమలకు సూరత్ ప్రధాన కేంద్రం.

ఇటీవల సూరత్‌లో పర్యటించిన ప్రధాని మాట్లాడుతూ దేశ జీడీపీలో 6 నుంచి 7 శాతం వజ్రాలు, నగల వ్యాపారం ద్వారా వస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది దీపావళికి మరో వజ్రాల వ్యాపారి సావ్జీభాయ్ ధోలకియా తన సంస్థ ఉద్యోగులకు 1260 కార్లు, 400 ఫ్లాట్లు, ఆభరణాలు కానుకలుగా ఇచ్చి ఔరా అనిపించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.