యాప్నగరం

సర్జికల్ దాడులకు ఆ టీవీ యాంకరే కారణం

గతేడాది సెప్టెంబర్ లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో భారత సైన్యం చొరబడి తీవ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులకు

Samayam Telugu 1 Jul 2017, 1:40 pm
గతేడాది సెప్టెంబర్ లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో భారత సైన్యం చొరబడి తీవ్రవాద శిబిరాలపై జరిపిన సర్జికల్ దాడులకు ఓ టీవీ యాంకర్ వేసిన ప్రశ్నే పురికొల్పిందని కేంద్రమాజీ రక్షణమంత్రి, గోవా సీఎం మనోహర్ పారికర్ గుర్తు చేశారు.
Samayam Telugu surgical strikes triggered by tv anchor says manohar parrikar
సర్జికల్ దాడులకు ఆ టీవీ యాంకరే కారణం


‘2015 జూన్ 4న మయన్మార్ సరిహద్దులను దాటుకొని ఈశాన రాష్ట్రాల అతివాద సంస్థకు చెందిన తీవ్రవాద సంస్థ ఎన్సీసీఎన్-కే తీవ్రవాదులు మణిపూర్ లోని చందెల జిల్లాలో 18మంది జవాన్లను హతమార్చారు. కేవలం 200మంది తీవ్రవాదులున్న సంస్థ జవాన్లను హతమార్చడం మాకు అవమానంగా అనిపించింది. దీంతో అదే ఏడాది మన సైన్యం ప్రతికారంగా జూన్ 8న 80మంది తీవ్రవాదులను హతమార్చింది. ఆ సమయంలో కేంద్రమంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోర్.. సైన్యం శత్రుసేనలపై చేపట్టే ఆపరేషన్ల గురించి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వివరిస్తున్నారు. ఆ సమయంలో ఆ టీవీ యాంకర్ ‘ ఇవే దాడులను జమ్మూకశ్మీర్- పీవోకేపై చొరబడే తీవ్రవాదులపై చేసే ధైర్యం, శక్తి సామార్థ్యాలున్నాయా?’ అంటూ మంత్రిని అడిగారు. ఆ యాంకర్ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నా. ఆ యాంకర్ ప్రశ్నకు సమాధానంగా సెప్టెంబర్ 29న పీవోకేలోని తీవ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు జరిపాం’ అని పారికర్ గుర్తు చేశారు.

డీఆర్‌డీవో రూపొందించిన ‘స్వాతి వెపన్ లోకేషన్ రాడర్’ సాయంతో శత్రుశిబిరాలను గుర్తించి.. సర్జికల్ దాడులు జరిపేలా చేశామని ఆయన అన్నారు. ఇందులో పాకిస్థాన్ ఆర్మీ ఫైరింగ్ యూనిట్లను కూడా మట్టుబెట్టామని పేర్కొన్నారు.

పీవోకేలో తీవ్రవాదులతో పాకిస్థాన్ ఆర్మీ చేతులు కలిపి భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు చేసిన కుట్రలను సైన్యం సర్జికల్ దాడుల ద్వారా సమాధానం చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.