బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ తల్లిదండ్రులు.. తమ కుమార్తెపై తప్పుడు ప్రచారం చేస్తూ, కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. రాజకీయ కారణాలతో తన కుమార్తె పేరును చెడుగా ఉపయోగిస్తున్నారని, నిత్యం తమకు ఎదురవుతోన్న వేధింపులతో తమ జీవితం దారుణంగా మారిందని, తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చుట్టూ జరుగుతోన్న పరిస్థితులతో తమ జీవితాలను ముగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వాపోయారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ వద్ద మేనేజర్గా పనిచేసిన దిశా సాలియన్.. ఆయన మరణానికి కొన్ని రోజుల ముందే అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. వీరిద్దరి మృతి 2020లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
‘నా కుమార్తె పేరును చెడుగా ఉపయోగించకుండా ఉండేలా చూడాలని దేశంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు విజ్ఞప్తి చేశాం... ఇదే పిటిషన్ను ప్రధానమంత్రి, హోం మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్, ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపాం’ అంటూ దిశ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
‘నా కుమార్తె మరణం, ఆ తర్వాత జరిగిన సుశాంత్ ఆత్మహత్యతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో కొందరు ఊహాజనిత సమాచారాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు.. ఆదిత్య ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్న విరోధం కారణంగా నారాయణ్ రాణె, నితేశ్ రాణె ఈ విషయంలో తలదూర్చారు.. వారి రాజకీయ వైరంలోకి మమ్మల్ని లాగారు.. మా జీవితాలను దుర్భరంగా మార్చారు.. జూన్ 4, 2020 నుంచి నా కుమార్తె తను ఉండే ఇంటి నుంచి బయటకు రాలేదని తన స్నేహితుల ద్వారా తెలిసింది.. అక్కడున్న సీసీ కెమెరాల ద్వారా అసలు విషయం బయటపెట్టండి..
కానీ, నారాయణ్, నితేశ్ మాత్రం కొందరు వ్యక్తులు దిశ గదిలోకి ప్రవేశించి, అత్యాచారం చేశారని చెబుతూనే ఉన్నారు.. ఇవి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు.. వాటి వల్ల మేం తలెత్తుకోలేకపోయాం.. మేం చివరకు ప్రశాంతంగా బాధపడలేకపోయాం.. వీరి తప్పుడు ఆరోపణలతో నా కుమార్తె వ్యక్తిత్వాన్ని కించపర్చడం మమ్మల్ని తీవ్రంగా గాయపర్చింది... వీటన్నింటిని చూసి, చనిపోవాలని ఎన్నోసార్లు అనుకున్నాం. మమ్మల్ని ఇంత క్షోభకు గురిచేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.. లేకపోతే మాకు చావే శరణ్యం
మా కూతురు చనిపోవడం వల్ల మా జీవితం అస్తవ్యస్తంగా మారింది.. ఆ తర్వాత రాణే, ఇతరులు ఈ పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేశారు.. నేరం నమోదైన తర్వాత కూడా కేంద్ర మంత్రి రాణే, ఆయన కుమారుడు మాపై దుష్ప్రచారం చేయడం ఆగపోలేదు.. గోప్యత, గౌరవంగా జీవించే మా ప్రాథమిక హక్కు కంటే అసత్య ప్రచారం చేసే వారి హక్కు ముఖ్యం కాబట్టి మేం జీవించి ఉన్నంత వరకు మాకు న్యాయం జరగదు’’ అని వాసంతి సాలియన్, సతీశ్ సాలియన్ తమ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
దిశా సాలియన్ మృతి కేసులో ముంబయి పోలీసుల ఎదుట మార్చి 6న కేంద్ర మంత్రి నారాయణ్ రాణే, నితేశ్ రాణే హాజరయ్యారు. 2020 జూన్ 8 దిశా సాలియన్ అనుమానాస్పదరీతిలో మృతిచెందగా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ వారం రోజుల తర్వాత జూన్ 14న ఆత్మహత్య చేసుకున్నారు.
‘నా కుమార్తె పేరును చెడుగా ఉపయోగించకుండా ఉండేలా చూడాలని దేశంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు విజ్ఞప్తి చేశాం... ఇదే పిటిషన్ను ప్రధానమంత్రి, హోం మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్, ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపాం’ అంటూ దిశ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
‘నా కుమార్తె మరణం, ఆ తర్వాత జరిగిన సుశాంత్ ఆత్మహత్యతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో కొందరు ఊహాజనిత సమాచారాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు.. ఆదిత్య ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్న విరోధం కారణంగా నారాయణ్ రాణె, నితేశ్ రాణె ఈ విషయంలో తలదూర్చారు.. వారి రాజకీయ వైరంలోకి మమ్మల్ని లాగారు.. మా జీవితాలను దుర్భరంగా మార్చారు.. జూన్ 4, 2020 నుంచి నా కుమార్తె తను ఉండే ఇంటి నుంచి బయటకు రాలేదని తన స్నేహితుల ద్వారా తెలిసింది.. అక్కడున్న సీసీ కెమెరాల ద్వారా అసలు విషయం బయటపెట్టండి..
కానీ, నారాయణ్, నితేశ్ మాత్రం కొందరు వ్యక్తులు దిశ గదిలోకి ప్రవేశించి, అత్యాచారం చేశారని చెబుతూనే ఉన్నారు.. ఇవి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు.. వాటి వల్ల మేం తలెత్తుకోలేకపోయాం.. మేం చివరకు ప్రశాంతంగా బాధపడలేకపోయాం.. వీరి తప్పుడు ఆరోపణలతో నా కుమార్తె వ్యక్తిత్వాన్ని కించపర్చడం మమ్మల్ని తీవ్రంగా గాయపర్చింది... వీటన్నింటిని చూసి, చనిపోవాలని ఎన్నోసార్లు అనుకున్నాం. మమ్మల్ని ఇంత క్షోభకు గురిచేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.. లేకపోతే మాకు చావే శరణ్యం
మా కూతురు చనిపోవడం వల్ల మా జీవితం అస్తవ్యస్తంగా మారింది.. ఆ తర్వాత రాణే, ఇతరులు ఈ పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేశారు.. నేరం నమోదైన తర్వాత కూడా కేంద్ర మంత్రి రాణే, ఆయన కుమారుడు మాపై దుష్ప్రచారం చేయడం ఆగపోలేదు.. గోప్యత, గౌరవంగా జీవించే మా ప్రాథమిక హక్కు కంటే అసత్య ప్రచారం చేసే వారి హక్కు ముఖ్యం కాబట్టి మేం జీవించి ఉన్నంత వరకు మాకు న్యాయం జరగదు’’ అని వాసంతి సాలియన్, సతీశ్ సాలియన్ తమ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
దిశా సాలియన్ మృతి కేసులో ముంబయి పోలీసుల ఎదుట మార్చి 6న కేంద్ర మంత్రి నారాయణ్ రాణే, నితేశ్ రాణే హాజరయ్యారు. 2020 జూన్ 8 దిశా సాలియన్ అనుమానాస్పదరీతిలో మృతిచెందగా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ వారం రోజుల తర్వాత జూన్ 14న ఆత్మహత్య చేసుకున్నారు.