యాప్నగరం

హేమామాలిని నాట్యానికి ఫిదా అయిన కేంద్ర మంత్రి

గంగా నది ప్రాముఖ్యత, విశిష్టతను వివరిస్తూ బీజేపీ ఎంపీ, నటి హేమామాలిని చేసిన నాట్యప్రదర్శన దేశ, విదేశీ అతిథులను ఆకట్టుకుంది.

Samayam Telugu 23 Jan 2019, 1:28 pm
బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, బీజేపీ ఎంపీ హేమమాలిని తన నాట్య ప్రదర్శనతో మరోసారి ఆహుతులను మంత్రముగ్దుల్ని చేశారు. ఇక, ఆమె నృత్య ప్రదర్శనకు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఫిదా అయిపోయారు‌. ప్రవాసీ భారతీయ దివస్‌ సందర్భంగా మంగళవారం వారణాశిలో హేమమాలిని ‘మా గంగా’ పేరిట నృత్య ప్రదర్శన ఇచ్చారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ నృత్య నాటకాన్ని తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి అతిథులు హాజరయ్యారు. ఈ ప్రదర్శన ముగిసిన అనంతరం సుష్మా స్వరాజ్‌ వేదిక‌పైకి వెళ్లి హేమమాలిని ఆలింగనం చేసుకుని ప్రశంసలు కురిపించారు.‘నీ ప్రదర్శన ఎలా ఉందో చెప్పడానికి నాకు మాటల్లేవు. జీవితంలో తొలిసారి నీ నృత్య ప్రదర్శన ఎలా ఉందో చెప్పడానికి మూడే మూడు పదాలను వాడుతున్నాను. అద్భుతం, అనిర్వచనీయం, ఊహాతీతం’ అంటూ సుష్మా కొనియాడారు.
Samayam Telugu hema


గంగ పాత్రలో నటించిన హేమ, గంగా నది ప్రాముఖ్యతను వివరిస్తూ చేసిన నృత్యం ఎంతో‌ అక్కడవారిని ఆకట్టుకుంది. ఎంతో పవిత్రమైన గంగా నది ప్రస్తుతం కాలుష్యా కాసారంగా ఎలా మారిందో కళ్లకు కట్టినట్టు వివరించారు. ఈ నాటకం కోసం ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ నీతా లుల్లా దుస్తులను డిజైన్‌ చేశారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు అసిత్ దేశాయ్, ఆయన కుమారుడు అలాప్‌లు స్వరాలు సమకూర్చగా, గాయకులు శంకర్ మహాదేవన్, కవితాకృష్ణమూర్తి, సుదేశ్ వాడ్కర్, మికా సింగ్‌లు ఆలపించారు. వారణాశి వేదికగా సాగుతోన్న ప్రవాసీ భారతీయ దివస్‌ వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించగా, ముగింపు వేడుకలకు అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచ్చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.