యాప్నగరం

గీతను తల్లిదండ్రుల చెంతకు చేరిస్తే, రూ. లక్ష నజరానా

భారత్‌లో వున్న తన తల్లిదండ్రులని కలిసేందుకు రెండేళ్ల క్రితం పాకిస్థాన్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన దివ్యాంగురాలు గీతను...

TNN 2 Oct 2017, 9:02 am
భారత్‌లో వున్న తన తల్లిదండ్రులని కలిసేందుకు రెండేళ్ల క్రితం పాకిస్థాన్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన దివ్యాంగురాలు గీతను ఆమె తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు సహాయపడాల్సిందిగా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దేశ ప్రజలకి విజ్ఞప్తిచేశారు. కోటి ఆశలతో కన్నవారిని కలిసేందుకు భారత్‌కి వచ్చిన గీతకు సహాయపడి ఆమె తల్లిదండ్రుల ఆచూకీ తెలిపేందుకు కృషిచేసిన వారికి రూ. లక్ష నజరానాగా అందించనున్నట్టు మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు.
Samayam Telugu sushma swaraj urges people to find geetas parents offers rs 1 lakh reward
గీతను తల్లిదండ్రుల చెంతకు చేరిస్తే, రూ. లక్ష నజరానా


గీత తమ కూతురే అంటూ కొన్ని కుటుంబాలు ముందుకొచ్చినప్పటికీ వారిని తన కన్నతల్లిదండ్రులుగా గీత గుర్తించలేదు. ప్రస్తుతం గీత మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో వున్న ఓ ఎన్జీవో సంస్థ సంరక్షణలో వుంది. మూగ, చెవుడు సమస్యలతో బాధపడుతున్న గీత గత రెండేళ్లలో సైగలతో తన భావాలని తెలియజెప్పడం, కంప్యూటర్ పరిజ్ఞానం, టైలరింగ్ వంటివి నేర్చుకుంది. కుటుంబం గుర్తొచ్చిన సందర్భాల్లో గీత కన్నీటి పర్యంతమవుతోందని ఆవేదన వ్యక్తచేశారు సుష్మా స్వరాజ్.

గీత తల్లిదండ్రులు ఎక్కడున్నా వచ్చి ఆమెని తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేసిన సుష్మా స్వరాజ్.. గీత చదువు, పెళ్లి గురించి ఆందోళన అవసరం లేదని, ఆమె బాగోగులన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు. 15 ఏళ్ల క్రితం లాహోర్‌లో ఆగి వున్న సంజౌతా ఎక్స్‌ప్రెస్‌లో గీత ఒంటరిగా వుండటాన్ని గుర్తించిన పాకిస్థాన్ రేంజర్స్ ఆమెని బిల్కిస్ ఈది నేతృత్వంలోని ఈది ఫౌండేషన్‌కి అప్పగించారు. అప్పటి నుంచి కరాచీలోని ఈది ఫౌండేషన్‌లో బిల్కిస్ ఈది సంరక్షణలోనే పెరిగిన గీత 2015 అక్టోబర్‌లో కన్నవారిని వెతుక్కుంటూ భారత్‌కి రావడం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.