యాప్నగరం

నెటిజన్ వింత ప్రశ్న.. సుష్మా స్వరాజ్ అదిరిపోయే పంచ్

విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్ ద్వారానే ఆమె నెటిజన్లకు ఎదురైన సమస్యల్ని పరిష్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏ సమస్య అయినా ఇట్టే స్పందించే సుష్మను ఓ నెటిజన్ విచిత్రమైన ప్రశ్నలాంటి సలహా అడిగారు.

Samayam Telugu 9 Aug 2018, 3:47 pm
విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్ ద్వారానే ఆమె నెటిజన్లకు ఎదురైన సమస్యల్ని పరిష్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏ సమస్య అయినా ఇట్టే స్పందించే సుష్మను ఓ నెటిజన్ విచిత్రమైన ప్రశ్నలాంటి సలహా అడిగారు. దీనిపైనా స్పందించిన కేంద్రమంత్రి.. ఓ సరదా సమాధానం ఇస్తూ చమత్కరించారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Samayam Telugu Sushma


సుశీల్ కే రాయ్ అనే నెటిజన్ తన ట్వీట్‌లో ‘బాలీకి వెళ్లటం సేఫేనా. ఆగష్టు 11 నుంచి 17 వరకు మేం అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నాం. దీనిపై మన ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు జారీ చేసిందా? దయచేసి మాకు సలహా ఇవ్వండని’ అడిగాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన సుష్మా స్వరాజ్.. ‘నేను అగ్ని పర్వతాన్ని సంప్రదించాలి’అంటూ చమత్కరించారు. సుష్మా స్వరాజ్ నెటిజన్‌కు ఇచ్చిన పంచ్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

రాయ్ ట్వీట్‌పై కొంతమంది నెటిజన్లు మండిపడ్డారు. విదేశాంగ మంత్రిని ఇలాంటి ప్రశ్నలు వేయడం పద్దతి కాదంటున్నారు. మరికొందరేమో సుష్మా చమత్కారాన్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇంతకీ రాయ్‌కి వచ్చిన సమస్య విషయానికొస్తే.. ఇండోనేషియా బాలీ ద్వీపంలోని అగుంగ్‌ అగ్నిపర్వతం నుంచి కొద్ది రోజులుగా లావా, బూడిద వస్తోందట. ముందస్తు జాగ్రత్తగా అక్కడ రాకపోకలపై ఆంక్షలు విధించారట. అందుకే రాయ్ సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారట.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.