యాప్నగరం

తలైవా రాజకీయ అరంగేట్రంపై తొలగని సందిగ్ధం.. మళ్లీ అభిమానులకు నిరాశే

Actor Rajinikanth రాజకీయాల్లో వస్తారా? లేదా? అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అయితే, మూడేళ్ల కింద రజనీ ఆ ఉత్కంఠకు తెర దించారు. రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించారు. అయినా ఇప్పటివరకు పార్టీ ప్రారంభించలేదు.

Samayam Telugu 30 Nov 2020, 1:42 pm
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయం అరంగేట్రంపై సందిగ్దం కొనసాగుతోంది. సోమవారం తన అభిమాన సంఘాల నాయకులతో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో రజినీ సమావేశమయ్యారు. రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో సమావేశం తర్వాత నేరుగా తన నివాసం పోయెస్ గార్డెన్‌కు చేరుకున్న రజినీ.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రవేశంపై వీలైనంత తర్వగా నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. మక్కళ మండ్రం సభ్యులతో తన అభిప్రాయాలను పంచుకున్నానని తెలిపారు. మక్కళ మండ్రంలోని లోటుపాట్ల గురించి చర్చించినట్టు తలైవా వివరించారు.
Samayam Telugu సూపర్ స్టార్ రజినీకాంత్


Read Also:
ఆగని చైనా జలచౌర్యం.. బ్రహ్మపుత్రపై మరో భారీ ప్రాజెక్టు

దీంతో రజినీ రాజకీయ ప్రవేశంపై మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి. కాగా, అభిమాన సంఘాలతో జరిగిన సమావేశంలో రజనీకాంత్ పార్టీపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2021 కల్లా తన పార్టీని ప్రకటించబోతున్నారని ఆయన అంతరంగికులు పేర్కొన్నారు. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంతే ముందుకు రాబోతున్నారని తెలిపారు. అభిమాన సంఘాల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రజనీకాంత్ ఈ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

Read Also: కరోనాతో కన్నుమూసిన మాజీ మంత్రి, బీజేపీ మహిళా ఎమ్మెల్యే

‘జనవరిలో పార్టీ ప్రారంభిస్తే మీరు రెడీగా ఉన్నారా? కొన్ని జిల్లాల అధ్యక్షుల పనితీరు ఏమాత్రం బాగోలేదు. మీరు కష్టపడితేనే మనం తరువాతి మెట్టు ఎక్కగలం.’అని రజనీకాంత్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కానీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అన్న విషయంలో మాత్రం తలైవా ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. అంతేకాదు, బీజేపీతో పొత్తు వద్దని ఈ భేటీలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు.

Read Also: మా ప్రతిష్ఠకు భంగం.. రూ.100 కోట్లకు పరువు నష్టం వేస్తాం: వాలంటీర్ నోటీస్‌పై సీరం

రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం సుమారు పాతికేళ్లుగా నలుగుతున్న విషయం. ఆయన రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అనే విషయమై 1996వ ఏడాది నుంచి చర్చ జరుగుతుండగా.. మూడేళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెరదించారు. ప్రకటన చేసినా క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరంగానే ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ అరంగేట్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చలకే పరిమితమైంది.

Read Also: యూపీలో అమానుషం.. ఇంటికి నిప్పంటించి జర్నలిస్ట్‌ హత్య

ఇదిలా ఉండగా.. ఆరోగ్య కారణాల దృష్ట్యా రజనీ తన రాజకీయ ఆలోచన విరమించుకోవాలని వైద్యులు సూచించినట్లు ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. డయాలసిస్‌ పేషెంట్‌ అయిన రజనీకాంత్‌ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బయట తిరగడం ఆయన ఆరోగ్యానికి ముప్పని డాక్టర్లు చెప్పినట్లు ఆ లేఖలో ఉంది. ఈ లేఖ సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో స్పందించిన రజనీ.. సరైన సమయంలో రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని అభిమానులకు హామీ ఇచ్చారు. అంతేకాదు, ఆ లేఖతో తనకు సంబంధంలేదు, కానీ తన ఆరోగ్యం గురించి చెప్పిన విషయం వాస్తవమేనని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.