యాప్నగరం

సీఎం మమతను 50 వేల ఓట్లతో ఓడించకపోతే.. దీటుగా స్పందించిన అధికారి

Nandigram: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విసిరిన సవాల్‌కు బీజేపీ నేత సువేందు అధికారి దీటుగా బదులిచ్చారు. నందిగ్రామ్‌లో సీఎం మమతను 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని ప్రకటించారు. లేకపోతే రాజకీయాలను నుంచి వైదొలుగుతానని పేర్కొన్నారు.

Samayam Telugu 18 Jan 2021, 9:42 pm
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలకు సువేందు అధికారి దీటుగా బదులిచ్చారు. నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేస్తానని మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది సేపటికే తనదైన శైలిలో స్పందించారు. ఆమెను 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని పేర్కొన్నారు. లేకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. నందిగ్రామ్ స్థానంలో మమతా బెనర్జీని ఢీకొట్టేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.
Samayam Telugu మమతా బెనర్జీ
Mamata Banerjee


అధికార తృణమూల్ కాంగ్రెస్‌ (TMC) లో కీలక నేతగా, మంత్రిగా కొనసాగిన సువేందు అధికారి.. మమతా బెనర్జీతో విభేదించి కొన్ని రోజుల కిందట బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. టీఎంసీ అధికారంలోకి రావడంలో నందిగ్రామ్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ఈ ఉద్యమంలో సువేందు అధికారి పాత్ర కీలకమైనది. అలాంటి నేత బీజేపీలో చేరడంతో బెంగాల్‌ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి.

కుదిరితే నందిగ్రామ్‌ స్థానం నుంచి కూడా తాను పోటీ చేస్తానని మమతా బెనర్జీ సోమవారం (జనవరి 18) ప్రకటించారు. నందిగ్రామ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నేతలు పార్టీ మారినా టీఎంసీపై ప్రజల్లో అభిమానం చెక్కుచెదరలేదని అన్నారు. నందిగ్రామ్ తనకు అదృష్టాన్నిచ్చే ప్రాంతం అని వ్యాఖ్యానించారు.

సువేందు Vs మమతా బెనర్జీ


సోమవారం కోల్‌కతాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సువేందు అధికారి.. సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఇలా స్పందించారు. ‘నందిగ్రామ్ స్థానంలో మమతా బెనర్జీని 50 వేల ఓట్లతో ఓడిస్తాను. లేదంటే నేను రాజకీయాల నుంచి వైదొలగుతాను. టీఎంసీ ఇక పార్టీ కాదు. అది ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ’ అని ఆయన అన్నారు. ఎన్నికల కోసం టీఎంసీ రాజకీయ వ్యూహకర్తలను నియమించుకునేందుకు ప్రయత్నించడమే బెంగాల్‌లో బీజేపీకి ఉన్న పట్టుకు నిదర్శనమని సువేందు పేర్కొన్నారు.

మమతా బెనర్జీకి భవానీపూర్‌లో గెలుస్తాననే నమ్మకం లేకే నందిగ్రామ్‌లో పోటీ చేస్తానని ప్రకటించారని బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ విమర్శలు కురిపించారు. 4 నెలల్లో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.

Also Read:

ఆన్‌లైన్ పాఠాలు.. ఫోన్ కొనివ్వని పేరెంట్స్, బాలిక ఆత్మహత్య

రైల్లో పురిటినొప్పులు.. బ్లేడు, దారంతో డెలివరీ, త్రీ ఇడియట్స్ సినిమా లాంటి సీన్; హ్యాట్సాఫ్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.