యాప్నగరం

మోడీ 'పబ్లిసిటీ' కామెంట్ పై స్వామి కౌంటర్

ప్రధాని మోడీ పరోక్ష విమర్శలకు సుబ్రమణ్య స్వామీ పరోక్షంగానే బదలిచ్చారు.

TNN 29 Jun 2016, 1:10 pm
ఢిల్లీ : చీప్ పబ్లిసిటీ కోసం ఏదో ఒకటి మాట్లాడుతుంటే దేశానికి ఒరిగేది ఏమీ ఉండదన్న ప్రధాని మోడీ కామెంట్స్ పై సుబ్రమణ్యం స్వామీ బుధవారం ట్విట్లర్‌లో స్పందించారు.. పబ్లిసీటీ కావాలనుకునే రాజకీయ నేతల ఇళ్లముందు పదుల సంఖ్యలో ఓబీ వ్యాన్లు ఉంటాయని .. చానళ్లు, ప్రచార డబ్బా కొట్టే వారి నుంచి వందల కొద్ది మిస్ట్ కాల్స్ వస్తాయి.. అలాంటి ఆర్భాటాలు తన దగ్గర లేవని తాను అవినీతి, అసమర్థ విధానాలపై పోరాటం చేస్తున్నానని స్వామీ బదులిచ్చారు. ప్రధాని మోడీలాగా తాను పబ్లిసిటీ కోసం ఆరాట పడటం లేదని జనాల్లో వెళ్లేలా స్వామీ మెసేజ్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. స్వామీ వ్యాఖ్యలు పరోక్షంగా ప్రధాని మోడీ ని ఉద్దేశించినవేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Samayam Telugu swamy tweets indirectly about pm modis publicity comment
మోడీ 'పబ్లిసిటీ' కామెంట్ పై స్వామి కౌంటర్


సోమవారం టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ కొందరూ చీప్ పబ్లిసిటీ కోసమే ఆర్బీఐ గవర్నర్ ను విమర్శిస్తున్నారని.. అలాంటి విమర్శల వల్ల దేశానికి ఒరిగేది ఏమీ లేదని సుబ్రమణ్యస్వామిని ఉద్దేశించి ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు మౌనం దాల్చిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామీ బుధవారం ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఆయన 48 గంటలు లేటుగా స్పందించినా కాస్త లేటెస్ట్ గానే బదులు ఇచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.