యాప్నగరం

2G తీర్పు.. స్వామి హాట్ కామెంట్స్

2జీ స్కామ్ లో ప్రధాన నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ.. సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై

TNN 21 Dec 2017, 2:50 pm
2జీ స్కామ్ లో ప్రధాన నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ.. సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్పందించారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. ఈ కేసు విచారణలో అత్యంత కీలకమైన వ్యక్తి స్వామి. కాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత.. స్వామి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్పందించడంతో 2జీ స్కామ్ పై విచారణ మొదలైంది. ఈ కేసులో ప్రధాన లిటిగెంట్ గా సుబ్రమణ్యస్వామి ప్రచారాన్ని పొందారు. ఈ స్కామ్ పై సీబీఐ విచారణ మొదలైన కొత్తలో స్వామి ఒక వెలుగు వెలిగారు. ఈ స్కామ్ లో రాజా, కనిమొళి పాత్రలపై స్వామి గట్టి ఆరోపణలు చేశారు కూడా.
Samayam Telugu swamy urges government to file appeal in high court after 2g verdict
2G తీర్పు.. స్వామి హాట్ కామెంట్స్


అయితే ఇప్పుడు రాజా, కనిమొళిలు నిర్దోషులుగా బయటకు వచ్చారు. కోర్టు ఈ మేరకు తీర్పును ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్వామి స్పందిస్తూ.. అప్పుడు ఈ కేసు కథ అయిపోయేలేదని అంటున్నారు.

పై కోర్టుకు వెళితే అక్కడ తీర్పు తారుమారు అవుతుంది అని స్వామి అభిప్రాయపడ్డారు. ఈ కేసు తీర్పుపై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. ఇంతకు ముందు కూడా పలు కేసుల్లో కోర్టు మారినప్పుడు తీర్పు మారిపోయిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు. డీఎంకే వాళ్లు అప్పుడే సంబరాలు చేసుకోకూడదని.. పై కోర్టులో తీర్పు మారడం ఖాయం, డీఎంకే ముఖ్య నేతలు ఈ కేసులో దోషులుగా తేలడం ఖాయం అని స్వామి అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.