టీచర్గా పనిచేస్తున్న యువతిని ప్రేమపేరుతో వేధించి.. ఆమె పెళ్లికి నిరాకరించడంతో పెద్దమ్మ కొడుకే కిరాతకంగా గొంతుకోసి చంపిన ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిండుగల్లుకి చెందిన పవిత్ర (24) ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్గా పనిచేస్తోంది. ఆమెకి అన్న వరుసయ్యే మాయావన్ (26) రోజూ.. బైక్పై స్కూల్కి తీసుకెళ్లి.. మళ్లీ తీసుకొచ్చేవాడు. పెద్దమ్మ కొడుకే కావడంతో.. పవిత్ర కూడా చనువుగా ఉండేది.
పవిత్ర తనతో సన్నిహితంగా మెలగడంతో దాన్నే మాయవన్ ప్రేమగా భ్రమించాడు. ఈ విషయాన్ని ఆమెకి చెప్పగా సున్నితంగా తిరస్కరించింది. అయితే.. ఇటీవల పవిత్ర కుటుంబ సభ్యులు ఆమెకి ఓ యువకుడితో నిశ్చితార్థం నిర్వహించడంతో.. మాయవన్ పగ పెంచుకున్నాడు. వచ్చే నెలలో వివాహానికి ముహూర్తం ఖరారు చేయగా.. గత బుధవారం పెళ్లి షాపింగ్ కోసం మాయవన్తో కలిసి పవిత్ర వెళ్లింది. తిరుగు ప్రయాణంలో.. మాయవన్ తన మనసులో మాటని మళ్లీ పవిత్రతో చెప్పాడు. దీంతో.. అన్న వరుసయ్యే నీతో వివాహమా..? పిచ్చిమాటలు మానేయ్..! అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో.. కోపద్రిక్తుడైన మాయవన్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో.. పవిత్ర గొంతుపై కోసి ఆటోలోంచి దూకేశాడు. భయాందోళనకి గురై ఆటోడ్రైవర్ వెంటనే పవిత్రని ఆసుపత్రిలో చేర్చగా.. మధురై ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచింది.
పవిత్ర తనతో సన్నిహితంగా మెలగడంతో దాన్నే మాయవన్ ప్రేమగా భ్రమించాడు. ఈ విషయాన్ని ఆమెకి చెప్పగా సున్నితంగా తిరస్కరించింది. అయితే.. ఇటీవల పవిత్ర కుటుంబ సభ్యులు ఆమెకి ఓ యువకుడితో నిశ్చితార్థం నిర్వహించడంతో.. మాయవన్ పగ పెంచుకున్నాడు. వచ్చే నెలలో వివాహానికి ముహూర్తం ఖరారు చేయగా.. గత బుధవారం పెళ్లి షాపింగ్ కోసం మాయవన్తో కలిసి పవిత్ర వెళ్లింది. తిరుగు ప్రయాణంలో.. మాయవన్ తన మనసులో మాటని మళ్లీ పవిత్రతో చెప్పాడు. దీంతో.. అన్న వరుసయ్యే నీతో వివాహమా..? పిచ్చిమాటలు మానేయ్..! అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో.. కోపద్రిక్తుడైన మాయవన్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో.. పవిత్ర గొంతుపై కోసి ఆటోలోంచి దూకేశాడు. భయాందోళనకి గురై ఆటోడ్రైవర్ వెంటనే పవిత్రని ఆసుపత్రిలో చేర్చగా.. మధురై ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచింది.