యాప్నగరం

రేప్ కేసులో నిందితుడికి అనుకూలంగా తీర్పు.. రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశం!

తప్పుడు ఆరోపణలతో అక్రమంగా కేసు బనాయించిన ఓ బాధితుడికి న్యాయస్థానంలో కాస్త ఉపశమనం లభించింది. అతడికి పరిహారం చెల్లించాలని తప్పుడు కేసు పెట్టిన మహిళ, ఆమె తల్లిదండ్రులను ఆదేశించింది.

Samayam Telugu 21 Nov 2020, 10:19 am
అత్యాచారం కేసులో నిందితుడిగా ఓ వ్యక్తికి అరుదైన ఉపశమనం లభించింది. అత్యాచారం ఆరోపణలతో అరెస్టయి ఏడేళ్లకుపైగా విచారణను ఎదుర్కొన్న వ్యక్తికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని చెన్నై న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారం ఆరోపణలు చేసిన మహిళకు జన్మించిన బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా.. నిందితుడి డీఎన్‌ఏతో సరిపోలేదు. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేసి, జీవితాన్ని నాశనం చేశారంటూ సదరు వ్యక్తి కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. తనకు రూ.30 లక్షల మేర పరిహారం కోరుతూ సంతోష్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది.
Samayam Telugu రేప్ కేసులో నిందితుడికి అనుకూలంగా తీర్పు
Representative image


Read Also:
సైన్యం అప్రమత్తతతో పెను ముప్పు తప్పింది.. నగరోటా ఎన్‌కౌంటర్‌పై మోదీ ప్రశంసలు

అతడి వాదనల్లో న్యాయముందని తేల్చిన కోర్టు.. రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలని తప్పుడు ఆరోపణలు చేసిన మహిళ, ఆమె తల్లిదండ్రులకు ఆదేశించింది. తనపై ఆరోపణలు చేసిన మహిళ, ఆమె తల్లిదండ్రులు, కేసు దర్యాప్తు చేసిన చెన్నైలోని సెక్రటేరియట్ కాలనీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ల నుంచి రూ.30 లక్షల పరిహారం ఇప్పించాలని సంతోష్ డిమాండ్ చేశారు.

Read Also:
ఢిల్లీ: భౌతికదూరం పాటించకపోయినా, ఉమ్మినా రూ.2వేలు ఫైన్
సంతోష్ తరఫు లాయర్ సిరాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్ కుటుంబం, ఆరోపణలు చేసిన మహిళ కుటుంబం ఇరుగు పొరుగున నివశించేవారని తెలిపారు. ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో సంతోష్‌, యువతి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి.

Read Also: Covaxin మూడో దశ ట్రయల్స్: ఆరోగ్య మంత్రికి తొలి డోసు.. త్వరలో గుడ్ న్యూస్

అయితే, కొద్ది రోజుల తర్వాత ఆ కుటుంబాల మధ్య ఆస్తి వివాదాల తలెత్తడంతో సంతోష్ కుటుంబం వేరే చోటుకి వెళ్లిపోయింది. ఇదే సమయంలో యువతి గర్బం దాల్చడంతో దీనికి సంతోష్ కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తూ తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరారు. దీనికి నిరాకరించిన సంతోష్.. ఆమెతో తాను ఎప్పుడూ సన్నిహితంగా మెలగలేదని వాదించాడు. దీంతో యువతి తల్లిదండ్రులు అతడిపై అత్యాచారం కేసు పెట్టారు.

Read Also: Delhi కాలుష్యంతో క్షీణిస్తున్న సోనియా ఆరోగ్యం.. గోవాకు షిప్ట్

నవంబరు 2009లో అరెస్టయిన సంతోష్ 95 రోజుల జ్యుడీషియల్ కస్టడీ తర్వాత 2010 ఫిబ్రవరి 12న బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటికే సదరు యువతి ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు నిర్వహించిన డీఎన్‌ఏ పరీక్షల్లో సంతోష్ తండ్రికాదని తేలింది. సుదీర్ఘ విచారణ అనంతరం 2016 ఫిబ్రవరి 10న మహిళా కోర్టు అతడిని నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది.

Read Also: ఒక్క అడుగు దూరంలో కరోనా‌కు టీకా.. అత్యవసర వినియోగం కింద ఎఫ్‌డీఏకి ఫైజర్ దరఖాస్తు

తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా అన్యాయంగా కేసు పెట్టి జీవితాన్ని నాశనం చేశారని పరువు నష్టం దావా వేశారు. కేసు కోసం రూ.2 లక్షల ఖర్చయ్యిందని మొత్తం రూ.30 లక్షల పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఆ మహిళ కుటుంబాన్ని ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.