యాప్నగరం

జల్లికట్టుకు అనుమతించమని మోడీకి లేఖ

తమిళనాడు రాష్ట్రంలో ప్రతి సంక్రాంతికి జల్లికట్టు క్రీడ ఆడడం ఆనవాయితీగా వస్తోంది.

TNN 9 Jan 2017, 6:19 pm
తమిళనాడు రాష్ట్రంలో ప్రతి సంక్రాంతికి జల్లికట్టు క్రీడ ఆడడం ఆనవాయితీగా వస్తోంది. ఎద్దులను వదిలి, వాటి వెంటపడి పట్టుకోవడమనే ఈ ఆటను నిషేధించాలని జంతుప్రేమికులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. 2014లో సుప్రీం కోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది. కాగా అప్పట్నించి దీనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేయాలంటూ కేంద్రాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పక్షాలు కోరుతూనే ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో సంక్రాంతి పండుగ ఉండడంతో ఇప్పుడైనా జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తి వేయాలని కోరుతూ తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం లేఖ రాశారు. సంప్రదాయంగా వస్తున్న జల్లికట్టుకు చట్టపరంగా ఉన్న ఇబ్బందులను తొలగించి, ఆ క్రీడను ఆడేందుకు అనుమతినివ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో దాదాపు వారం రోజుల పాటూ జల్లి కట్టును నిర్వహిస్తారు.
Samayam Telugu tamil nadu cm panneerselvam wrote a letter to pm narendra modi on jallikattu
జల్లికట్టుకు అనుమతించమని మోడీకి లేఖ


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.