యాప్నగరం

ఒకే ఖాతాలో రూ. 246 కోట్ల నల్లధనం జమ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దుచేసిన తరవాత తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వివిధ బ్యాంకుల్లో రూ. 600 కోట్ల నల్లధనం జమయింది.

TNN 26 Mar 2017, 1:03 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దుచేసిన తరవాత తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వివిధ బ్యాంకుల్లో రూ. 600 కోట్ల నల్లధనం జమయింది. ఈ మొత్తం 200 మంది వ్యక్తులు, కంపెనీలు జమచేసినవే కావడం విశేషం. వీటిలో చాలా బ్యాంకు ఖాతాలో గ్రామీణ ప్రాంతాల్లోవి కావడం గమనార్హం. అయితే కొన్ని ఖాతాలు చెన్నై నగరంలోని కూడా.
Samayam Telugu tamil nadu man deposits rs 246 crore in account will pay 45 of it as tax
ఒకే ఖాతాలో రూ. 246 కోట్ల నల్లధనం జమ!


ఆదాయ పన్ను శాఖ అధికారుల వివరాల ప్రకారం... తమిళనాడులోని నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్‌లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఒకే ఖాతాలో రూ. 246 కోట్ల నల్లధనాన్ని డిపాజిట్ చేశారు. సుమారు 15 రోజుల పాటు ఈ ఖాతాను గమనించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్రాంచీల ద్వారా కోట్ల కొద్ది డబ్బు ఒకే ఖాతాలో జమ అవుతున్నట్లు గుర్తించారు. తొలుత తప్పించుకోవడానికి ప్రయత్నించి ఆ ఖాతాదారుడు ఆ తరవాత ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై)’లో చేరడానికి అంగీకరించాడు. దీంతో అతను జమచేసిన మొత్తంలో 45 శాతాన్ని పన్నుగా వసూలు చేశారు.

అలాగే డీమానిటైజేషన్ తరవాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఖాతాల్లో అత్యధికంగా పాత నోట్లు జమ అవుతున్న విషయాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. అలా జమ అవుతున్న వ్యక్తిగత ఖాతాలను సేకరించారు. ఇదంతా నల్లధనంగా గుర్తించిన అధికారులు వారిని కూడా పీఎంజీకేవైలో చేర్చి పన్ను వసూలు చేస్తున్నారు. మార్చి 31తో నల్లధనాన్ని జమచేసే అవకాశం ముగుస్తుండటంతో చాలా మంది పీఎంజీకేవైలో చేరారని ఓ సీనియర్ ఐటీ అధికారి వెల్లడించారు. మార్చి 31 నాటికి రూ. 1000 కోట్ల వరకు నల్ల ధనం బ్యాంకు తమిళనాడు, పుదుచ్చేరిలోని బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఇప్పటికీ పీఎంజీకేవైలో చేరని కొంతమందికి హెచ్చరికలు పంపినట్లు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.