యాప్నగరం

మళ్లీ మొదలుపెట్టిన పన్నీరు సెల్వం!

తనకు వ్యతిరేకంగా కుట్రచేసి ఎడప్పాడి పళనిసామిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారని అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆరోపించారు.

TNN 16 Feb 2017, 8:37 pm
తనకు వ్యతిరేకంగా కుట్రచేసి ఎడప్పాడి పళనిసామిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారని అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆరోపించారు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని దీన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గురువారం రాత్రి చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఉన్న జయలలిత సమాధి వద్ద పార్టీ కార్యకర్తలతో కలసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పన్నీరు.. ఇప్పుడున్నది జయ ప్రభుత్వం కాదని, శశికళ కుటుంబ ప్రభుత్వమని విమర్శించారు.
Samayam Telugu tamil nadu political crisis panneerselvam paid tribute at jayalalithaas memorial at marina beach
మళ్లీ మొదలుపెట్టిన పన్నీరు సెల్వం!


తనకు జరిగిన అన్యాయంపై త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటన చేసి ప్రజల మద్దతు కూడగడతానని చెప్పారు. ప్రస్తుత సీఎం పళనిసామిని టార్గెట్ చేసిన పన్నీరు.. పళని వర్గమంతా శశికి ఊడిగం చేయాల్సిందేనని ఎద్దేవా చేసారు. ఇకపై శశికళ కుటుంబం చెప్పిందే వేదమని, చేసిందే చట్టమని అన్నారు. ఎమ్మెల్యేలు జారకుంటారనే భయంతోనే పళనిసామి ఇప్పటికిప్పుడు బలపరీక్షను తీసుకొచ్చారని ఆరోపించారు. జయలలిత వినియోగించిన దేవాలయం లాంటి వేదనిలయంలో శశి కుటుంబం ఉండేందుకు ఒప్పుకునేది లేదని స్పష్టం చేసారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.