యాప్నగరం

తమిళనాట మరో ట్విస్ట్: డీఎంకే వైపు ఎమ్మెల్యేల చూపు?

తమిళ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. శశికళ వర్గం క్యాంపు రాజకీయాలు నడుపుతున్న వేళ..

TNN 10 Feb 2017, 2:30 pm
తమిళ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. శశికళ వర్గం క్యాంపు రాజకీయాలు నడుపుతున్న వేళ.. 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విపక్ష డీఎంకేతో టచ్‌లోకి వచ్చారు. శశికళ, పన్నీరు సెల్వం ఆధిప్య పోరుతో విసిగిపోయామని చెప్పిన వారు.. డీఎంకేకు మద్దతు పలికేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. 234 శాసన సభ స్థానాలు ఉన్న తమిళనాడులో అన్నాడీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవడం కోసం 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. జయలలిత మరణంతో 117 మంది ఎమ్మెల్యేలు ఉంటే మెజార్టీని నిరూపించుకోవచ్చు.
Samayam Telugu tamilnadu 15 aiadmk mals in touch with dmk
తమిళనాట మరో ట్విస్ట్: డీఎంకే వైపు ఎమ్మెల్యేల చూపు?


మరికొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా డీఎంకేకు మద్దతు పలికితే ఆ పార్టీ చీలిపోవడంతోపాటు.. డీఎంకే అధికారంలోకి వస్తుంది. మరోవైపు సభలో బలం నిరూపించుకోవాల్సి వస్తే.. పన్నీరుకు మద్దతునిస్తామని ప్రకటించిన డీఎంకే.. తాజా పరిణమాల నేపథ్యంలో ఎలా వ్యవహరించనుందనేది ఆసక్తికరంగా మారింది.

శశికళ ఎమ్మెల్యేలను బంధించారని ఆరోపించిన పన్నీరు సెల్వం.. తనకే ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. అమ్మ తనను సీఎంగా ఎంపిక చేశారని వ్యాఖ్యానించారు. మరోవైపు అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన మధుసూదన్.. శశికళ సీఎం పదవికి అనర్హురాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.